న్యాయవ్యవస్థతో కేంద్రానికి ఘర్షణ లేదు
కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నాయని, అంత మాత్రాన దీనిని ఘర్షణగా చూడకూడదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
అభిప్రాయభేదాలు మాత్రమే..
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
మదురై(తమిళనాడు): కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నాయని, అంత మాత్రాన దీనిని ఘర్షణగా చూడకూడదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మదురైలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్తో కలిసి అదనపు కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని అర్థం చేసుకోండి. సహజంగానే కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు ఉంటాయి. దాన్ని ఘర్షణంటే ఎలా...? ఈ మొత్తం అంశాన్ని సంక్షోభంగా చూపించడం సరికాదు. విభేదాలు.. బలమైన ప్రజాస్వామ్యానికి సంకేతాలుగా భావించాలి.’’ అని మంత్రి పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎలాంటి భంగం కలగనివ్వమని తెలిపారు. కార్యక్రమంలో ప్రసంగించిన సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాత్రం కొలీజియం వ్యవస్థకు సంబంధించి కేంద్రంతో కొనసాగుతున్న వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. న్యాయవాద వృత్తిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మహిళలకు సమాన అవకాశాలు లభించడం లేదు. గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. తమిళనాడులో 50 వేల మంది పురుషులు న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తుంటే అందులో కేవలం 5 వేల మంది మాత్రమే మహిళలు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కుటుంబ బాధ్యతలతో వారు ఎక్కువ పనిగంటలు పనిచేయలేరని చెప్పి వారిని శిక్షించకూడదు. ఉద్యోగం, కుటుంబాన్ని సమతూకం చేసుకొని కెరీర్లో ముందుకు వెళ్లాలనుకొనే మహిళలకు సంస్థాగతంగా అండగా నిలవాల్సిన బాధ్యత మన మీద ఉంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తిని స్టాలిన్ అభ్యర్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్