రెండు ప్రయత్నాల్లో ఎంబీబీఎస్‌ పూర్తికి అవకాశం

కరోనా విస్తృతి సమయంలో ఉక్రెయిన్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ల నుంచి వెనక్కి వచ్చేసిన భారతీయ వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ తుది పరీక్షల్ని రెండు ప్రయత్నాల్లో పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

Published : 29 Mar 2023 05:40 IST

దిల్లీ: కరోనా విస్తృతి సమయంలో ఉక్రెయిన్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ల నుంచి వెనక్కి వచ్చేసిన భారతీయ వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ తుది పరీక్షల్ని రెండు ప్రయత్నాల్లో పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దేశంలోని ఏ వైద్య కళాశాలలోనూ చేరకుండానే ‘జాతీయ వైద్య కమిషన్‌’ పాఠ్యప్రణాళిక, మార్గదర్శకాలకు లోబడి పరీక్షలు రాయవచ్చని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం పేర్కొంది. ఒక్క అవకాశాన్నే ఇస్తామన్న కేంద్రం ప్రతిపాదనను ఈ మేరకు సవరించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని