చాక్లెట్ గణపతి!
మట్టి.. పేపరు.. పలురకాల దినుసులతో వినాయక విగ్రహాలను చూశాం. ముంబయిలోని శాంతాక్రజ్ ప్రాంతంలో నివసిస్తున్న కమర్షియల్ డిజైనర్ రింతూ రాథోడ్ ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు రెండడుగుల చాక్లెట్ గణపతిని తయారు చేశారు.
ముంబయి: మట్టి.. పేపరు.. పలురకాల దినుసులతో వినాయక విగ్రహాలను చూశాం. ముంబయిలోని శాంతాక్రజ్ ప్రాంతంలో నివసిస్తున్న కమర్షియల్ డిజైనర్ రింతూ రాథోడ్ ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు రెండడుగుల చాక్లెట్ గణపతిని తయారు చేశారు. తొమ్మిది రకాల చిరుధాన్యాలను కూడా ఇందులో వాడారు. ఈ ‘వృశ్చికాసన’ వినాయకుణ్ని ఎంచక్కా తినేయవచ్చు. ‘‘ఈ ముద్ర మన పురాణాల్లో ఉంది. నేను ఇటీవలే నాచురోపతి కోర్సు పూర్తి చేశా. కాబట్టి, రెండింటినీ మిళితం చేసి ఈ భంగిమలో విగ్రహం తయారుచేశా. ఇది ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’ కావడంతో కోకో (చాక్లెట్) పొడికి చిరుధాన్యాలు, ఎండు ఫలాల పేస్టు, బెల్లం కలిపి ఇందులో వాడా’’ అని రింతూ వివరించారు. 40 కేజీల బరువు ఉన్న ఈ విగ్రహ తయారీకి 20 గంటల సమయం పట్టింది. కరిగిపోకుండా ఏసీ గదిలో దీన్ని ఏర్పాటు చేశారు. 11వ రోజున ఈ గణపతిని పాలలో నిమజ్జనం చేసి, చాక్లెట్ కలిసిన పాలను స్థానికులకు, నిరుపేద పిల్లలకు పంపిణీ చేస్తామని రింతూ తెలిపారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!