యూపీలో మామిడి వైన్!
ఉత్తర్ప్రదేశ్ ప్రజలకు త్వరలో మామిడి వైన్ (మ్యాంగో వైన్) అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మద్యం విధానాన్ని సవరించాలని యూపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన పంపింది.
ఉత్తర్ప్రదేశ్ ప్రజలకు త్వరలో మామిడి వైన్ (మ్యాంగో వైన్) అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మద్యం విధానాన్ని సవరించాలని యూపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన పంపింది. 1974 తర్వాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని సవరించాల్సి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మామిడి వైన్ తయారీ యూనిట్లను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. రూ.70 లక్షలతో ఒక యూనిట్ ఏర్పాటవుతుందని అంచనా. సాధారణంగా వైన్ తయారీకి ద్రాక్ష పండ్లు ఉపయోగిస్తారు. ఉత్తర్ప్రదేశ్లో ద్రాక్ష ఉత్పత్తి పెద్దగా లేదు. అందుకే వినూత్నరీతిలో ఆలోచించిన ఎక్సైజ్ శాఖ.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇతర పండ్ల నుంచి వైన్ తయారు చేయాలని భావించింది. మామిడి పండ్ల ఉత్పత్తిలో ఉత్తర్ప్రదేశ్కు మంచి పేరుంది. యూపీలోని మలిహాబాద్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దశ్హరీ మామిడిని పండిస్తారు. ఈ మామిడి పండ్లనే వైన్ తయారీకి ఉపయోగించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు