ఐసొలేషన్ కేంద్రం తప్పనిసరి కాదు!
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్కు సంబంధించిన ఓ నిబంధనను కేంద్రం తాజాగా సవరించింది. ఈమేరకు భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్గా తేలితే.. ఇకపై వారు
అంతర్జాతీయ ప్రయాణికులకు సవరించిన నిబంధన
దిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్కు సంబంధించిన ఓ నిబంధనను కేంద్రం తాజాగా సవరించింది. ఈమేరకు భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్గా తేలితే.. ఇకపై వారు నిర్దేశించిన ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం తప్పనిసరి కాదని అధికార వర్గాలు తెలిపాయి. వారు సాధారణ కొవిడ్ ప్రోటోకాల్ను అనుసరిస్తే సరిపోతుందని వెల్లడించాయి. కేంద్రం తాజాగా ‘సవరించిన మార్గదర్శకాల్లో’ ఈమేరకు మార్పు చేసింది. ఈ కొత్త నిబంధన జనవరి 22 నుంచి తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుంది. కాగా మిగిలిన నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనలే వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!