Crime News: రాఖీ రోజే అక్కను, ఆమె ప్రియుడిని చంపిన తమ్ముడు
అక్కకు రక్షగా ఉండాల్సిన తమ్ముడే.. ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని కూడా హతమార్చాడు. రాఖీ పండగ రోజే ఈ అమానవీయ ఘటన జరగడం కలచివేస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్లో శుక్రవారం రాత్రి ఈ పరువు హత్య కలకలం రేపింది. మైనర్ అయిన నిందితుడు హత్య అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
జల్గావ్: అక్కకు రక్షగా ఉండాల్సిన తమ్ముడే.. ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని కూడా హతమార్చాడు. రాఖీ పండగ రోజే ఈ అమానవీయ ఘటన జరగడం కలచివేస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్లో శుక్రవారం రాత్రి ఈ పరువు హత్య కలకలం రేపింది. మైనర్ అయిన నిందితుడు హత్య అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రాకేశ్ సంజయ్ రాజ్పుత్(22), వర్ష సమాథాన్ కోలీ(20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం వర్ష ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తమ్ముడు పిస్టల్ తీసుకొని వారిని వెంబడించాడు. ఈ క్రమంలోనే రాజ్పుత్ను కాల్చి చంపిన నిందితుడు.. తన సోదరిని గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధాన నిందితుడు పిస్టల్తో పోలీసులకు లొంగిపోయాడు. మరో మైనర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో భాగమైన మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్