పీఎఫ్‌ చందాదార్లెవరూ వడ్డీ కోల్పోలేదు

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదార్లకు వడ్డీపరంగా ఎటువంటి నష్టం జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

Published : 07 Oct 2022 06:27 IST

సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడింగ్‌తో జమ ఆలస్యం: ఆర్థిక శాఖ

దిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదార్లకు వడ్డీపరంగా ఎటువంటి నష్టం జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియ వల్లే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైందని పేర్కొంది. సెటిల్‌మెంట్‌, పీఎఫ్‌ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీతో కలిపే చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది. ‘చందాదార్లు ఎవరికీ వడ్డీ నష్టం జరగలేదు. అందరి ఖాతాల్లో వడ్డీ జమ అయింది. పన్ను విధానంలో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియ చేపట్టడంతో.. వడ్డీ జమ అయినట్లు స్టేట్‌మెంట్‌లో కనిపించలేదు’’ అని మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. ఈపీఎఫ్‌ వడ్డీ జమ విషయంలో టి.వి.మోహన్‌దాస్‌ పాయ్‌ లేవనెత్తిన సందేహాలకు స్పందిస్తూ ఆర్థిక శాఖ ఈ స్పష్టత ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వార్షికంగా పీఎఫ్‌ జమ రూ.2.5 లక్షలకు మించితే పన్ను విధించడాన్ని 2021-22 నుంచే ప్రభుత్వం ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని