AIIMS-Delhi: దిల్లీ ఎయిమ్స్పై హ్యాకర్ల పంజా.. ₹200 కోట్లకు డిమాండ్!
దేశ రాజధాని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)పై హ్యాకర్లు పంజా విసిరారు. ఎయిమ్స్ నుంచి హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)పై హ్యాకర్లు పంజా విసిరారు. ఎయిమ్స్ నుంచి హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని వారు కోరుతున్నారని తెలిసింది. గత ఆరు రోజులుగా ఇక్కడి సర్వర్లు నిలిచిపోవడంతో ఆస్పత్రిలోని ప్రక్రియ అంతా మాన్యువల్గానే జరుగుతోంది.
ఎయిమ్స్లో సర్వర్లు మొరాయించినట్లు తొలుత బుధవారం గుర్తించారు. సుమారు 3-4 కోట్ల మంది రోగుల సమాచారం వీటిల్లో నిక్షిప్తమై ఉంది. ఇందులో పలువురు వీఐపీలు, మాజీ ప్రధానులు, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులకు సంబంధించి ఆరోగ్య సమాచారం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వర్లు నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, లేబోరేటరీ వంటి సేవలు మాన్యువల్గానే నిర్వహిస్తున్నారు.
మరోవైపు హ్యాకర్ల దాడిపై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN), దిల్లీ పోలీసులు, హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధులు దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ, సైబర్ ఉగ్రవాదం అభియోగాల కింద దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సంస్థల ఆదేశంతో ఆస్పత్రిలోని కంప్యూటర్లన్నింటికీ ఇంటర్నెట్ సేవలు తొలగించారు. ఇ-హాస్పిటల్ డేటా బేస్ను పునరుద్ధరించారు. మరోవైపు ఎయిమ్స్ నెట్వర్క్ను పూర్తిగా యాంటీ వైరస్ ద్వారా స్కాన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఐదు రోజుల పాటు కొనసాగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్