మాస్క్ ధరించలేదో.. రెజ్లర్లు ‘పట్టు’పడతారు
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాపై పోరాడేందుకు రెజ్లర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కులు తొడుగుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు....
లూచా లిబ్రే రెజ్లర్ల వినూత్న ప్రయత్నం
మెక్సికో: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాపై పోరాడేందుకు రెజ్లర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కులు తొడుగుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని ధాటికి అనేక రంగాలు కుదేలైపోయాయి. ఎంతోమందికి ఉపాధి కరవైంది. దక్షిణ అమెరికాలోని మెక్సికోలో విశేష ప్రాచుర్యం పొందిన లూచా లిబ్రే రెజ్లింగ్ కూడా కొవిడ్ దెబ్బకు కుదేలైంది. కరోనాకు ముందు రెజ్లింగ్కు వేలమంది హాజరయ్యేవారు. కొవిడ్ కారణంగా రెజ్లింగ్ కార్యక్రమాలను నిలిపివేయడంతో రెజ్లర్లు ఉపాధి కోల్పోయారు.
మహమ్మారి అంతరించిపోతేనే తిరిగి తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన రెజ్లర్లు కరోనాపై పోరుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజు దాదాపు ఐదు లక్షల మంది వచ్చే అత్యంత ప్రసిద్ధి గాంచిన ‘డి అబాస్టో’ మార్కెట్కు ఎవరైనా మాస్కు ధరించకుండా వస్తే వారిని దొరకబుచ్చుకొని మరీ మాస్కు తొడుగుతున్నారు. రెజ్లింగ్ రింగ్లోకి దిగే దుస్తులు ధరించి, మాస్కులు పెట్టుకొని.. మాస్కు లేకుండా మార్కెట్కు వచ్చే కొనుగోలుదారులు, మార్కెట్లో ఉన్న అమ్మకందారులను మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. సమాజం పట్ల బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు.
మెక్సికోలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అక్కడ 2 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంటినుంచి బయటకు వచ్చేవారు మాస్కులు ధరించకుండా వస్తున్నారని, వారంతా మార్కెట్లలో గుమిగూడి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని రెజ్లర్లు ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని