Manipur: తిరుగుబాటు దళంతో త్వరలోనే శాంతి ఒప్పందం! మణిపుర్ సీఎం
ఓ తిరుగుబాటు దళంతో తమ ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతోందని మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ ఓ వార్తాసంస్థతో తెలిపారు.
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో మణిపుర్ (Manipur) అట్టుడికిపోయిన విషయం తెలిసిందే. స్థానికంగా పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ (Biren Singh) కీలక విషయం వెల్లడించారు. ఇంఫాల్ లోయకు చెందిన ఓ తిరుగుబాటు బృందంతో తమ ప్రభుత్వం శాంతి చర్చలు (Peace Talks) జరుపుతోందని ఓ వార్తాసంస్థతో తెలిపారు. అయితే.. ఆ గ్రూపు పేరు వెల్లడించలేదు. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశిస్తున్నామన్నారు. మే 3న మణిపుర్లో హింస (Manipur Violence) చెలరేగినప్పటినుంచి.. ప్రభుత్వ ఆధ్వర్యంలో శాంతి చర్చల గురించి అధికారికంగా ధ్రువీకరించడం ఇదే మొదటిసారి. నిషేధిత యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)లోని ఒక వర్గంతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
ఆ ఆయుధాలు ఇంకా వారి చేతుల్లోనే: ఆర్మీ ఉన్నతాధికారి
తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్ల డిమాండ్కు వ్యతిరేకంగా నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ అనంతరం మణిపుర్లో హింసాకాండ మొదలైంది. కొన్నినెలలపాటు ఇది కొనసాగింది. జాతుల మధ్య పరస్పర దాడులు, ఇళ్లకు నిప్పుపెట్టడం, ఆయుధాల లూటీ వంటివి చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు 180 మందికిపైగా మరణించారు. అయితే.. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఆయా హింసాత్మక ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. మణిపుర్ జనాభాలో మైతేయ్లు దాదాపు 53 శాతం ఉన్నారు. వారంతా ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. 40 శాతంగా ఉన్న నాగాలు, కుకీలు ఇతర తెగలు.. పర్వత ప్రాంతాలకు పరిమితమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కాగా కుట్రలు రచించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు నటుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో అరెస్టు చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు జాడలేకుండా పోయిన నిందితుడి తల్లి పోలీసులకు చిక్కారు. -
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
Nagpur Temperature: నాగ్పుర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. సెన్సర్ తప్పిదం వల్లే 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేసింది. -
అంచనాల కంటే ముందే వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. -
నడక.. జపం.. ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. రెండోరోజు కార్యక్రమ వీడియోలను భాజపా విడుదల చేసింది. -
రేపు లొంగిపోతా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. -
భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది. -
ఎయిరిండియా విమానం 24 గంటలు ఆలస్యం.. ఉక్కపోతతో స్పృహతప్పిన ప్రయాణికులు
దేశ రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. -
మలద్వారంలో 960 గ్రాముల బంగారం.. కేరళలో ఎయిర్హోస్టెస్ అరెస్ట్
కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి బంగారం అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది. -
సుప్రీం కొలీజియం నిర్ణయాల్లో జోక్యానికి దిల్లీ హైకోర్టు నిరాకరణ
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫార్సులను నిరాకరించడానికి కారణాలేమిటో సుప్రీంకోర్టు కొలీజియం సవివరంగా తెలియజేసేలా ఆదేశించాలని కోరుతూ రాకేశ్కుమార్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. -
150 ఏళ్లుగా రుతుపవనాల రాకలో మార్పులు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి. -
అడుగంటుతున్న ప్రధాన జలాశయాలు
దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతానికి పడిపోయినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ జలాశయాల్లో గత వారం 24 శాతం నీటిమట్టం ఉండేది. -
బిభవ్ కుమార్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. -
శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా కేసుల విచారణార్హతపై తీర్పు రిజర్వు
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదానికి సంబంధించిన కేసుల విచారణార్హతపై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వు చేసింది. -
వరదలతో అస్సాం విలవిల
రెమాల్ తుపాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అస్సాంలో మొదలైన వరదలు మరింత తీవ్రరూపం దాల్చాయి. శుక్రవారం వరదల కారణంగా ఆ రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. -
ఏవియన్ ఇన్ఫ్లుయెంజాతో జాగ్రత్త: కేంద్రం
దేశంలోని పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశుసంవర్థక విభాగంతో పంచుకోవాలని సూచించింది. -
దేశంలో వాతావరణ అత్యయిక స్థితి!
వేసవి కాలం పూర్తికావస్తున్నా దేశంలో నమోదవుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలను చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. -
కటకటాల్లోకి ప్రజ్వల్
మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్)ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. -
అదృశ్యమైన కోటా విద్యార్థి.. 23 రోజులు.. దేశమంతా చక్కర్లు కొట్టి!
ఇటీవల రాజస్థాన్లోని కోటా నుంచి అదృశ్యమైన ఓ విద్యార్థి.. 23 రోజుల వ్యవధిలో జమ్మూ-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాలన్నీ చుట్టేయడం గమనార్హం. -
భారత ఎన్నికలపై కోవర్ట్ ఆపరేషన్.. ఓపెన్ఏఐ సంచలన నివేదిక
లోక్సభ ఎన్నికలపై ఇజ్రాయెల్కు చెందిన సంస్థ ఒకటి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించిందని, దాన్ని తాము అడ్డుకున్నట్లు ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు
-
వారు తిరస్కరణ మోడ్లో ఉన్నారు: భాజపా
-
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
-
పాండ్య ‘బ్యాకప్’ పేసర్.. బౌలింగ్ కాంబినేషన్ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్
-
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
-
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు