Third wave: ‘థర్డ్వేవ్ వచ్చేసింది’ నేను అలా అనలేదు..
మహారాష్ట్రలో ‘కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది’ అంటూ నిన్న చేసిన వ్యాఖ్యల విషయంలో ముంబయి నగర మేయర్ కిశోరి పెండేకర్ వెనక్కి తగ్గారు. మంగళవారం చేసిన వ్యాఖ్యల్ని........
ముంబయి: మహారాష్ట్రలో ‘కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది’ అంటూ నిన్న చేసిన వ్యాఖ్యల విషయంలో ముంబయి నగర మేయర్ కిశోరి పెండేకర్ వెనక్కి తగ్గారు. మంగళవారం చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న ఆమె.. కరోనా థర్డ్ వేవ్ మన ముంగిటే ఉందన్నారు. ‘ముంబయిలో థర్డ్ వేవ్ ఉందని నేను అనలేదు. మంత్రి నితిన్ రౌత్ నాగ్పూర్లో థర్డ్వేవ్ ఉన్నట్టు చెప్పారు. థర్డ్వేవ్ మన ఇంటి ముంగిటే ఉందని, అందుకు జాగ్రత్తలు అవసరం అని మాత్రమే నేను చెప్పా’’ అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ,‘థర్డ్వేవ్ రావడం కాదు.. అది ఇక్కడే ఉంది’ అంటూ నిన్న మేయర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై మేయర్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ముంబయి ప్రవేశ ద్వారం వద్దే కరోనా థర్డ్వేవ్ ఉందనేదే ఆమె ఉద్దేశమని స్పష్టంచేసింది. గత రెండు దశల్లో అనుభవాలను బట్టి.. అది మన చేతుల్లోనే ఉంది అని పేర్కొంది.
కరోనా ఇంకా పోలేదు.. గుర్తుంచుకోండి: ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కేసులు స్వల్పంగా పెరుగుతుండటంపై మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. కరోనా ఇంకా పోలేదని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు ఇంకా 12 నుంచి 18 ఏళ్ల వయసువారికి టీకాలు రాలేదన్నారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి చెందడంతో పాశ్యాత్య దేశాల్లోని చిన్న పిల్లల ఆస్పత్రులు నిండిపోతున్నాయన్నారు. థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నామన్నారు. అందరూ కొవిడ్ నిబంధనల్ని పాటిస్తే.. థర్డ్వేవ్ రాకుండా ఆలస్యం చేయవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్