అవును ఆ లేఖ నేనే రాశాను: పరమ్బీర్
ముఖేశ్ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో మహారాష్ట్ర సర్కారుకు కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రెకు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ రాసినట్లు
ఇంటర్నెట్డెస్క్: ముఖేశ్ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో మహారాష్ట్ర సర్కారుకు కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ రాసినట్లు చెబుతున్న లేఖపై పలు అనుమానాలు ఏర్పడ్డాయి. నేడు ఆ ఊహాగానాలకు ఐపీఎస్ అధికారి పరమ్బీర్ సింగ్ తెరదించారు. తానే ఆ లేఖను సీఎంకు రాసినట్లు అంగీకరించారు.
ఆ లేఖపై పరమ్బీర్ సంతకం లేకపోవడంతో తొలుత చాలా మంది అనుమానించారు. కానీ, ఆ తర్వాత పరమ్బీర్ సింగ్ తానే ముఖ్యమంత్రికి ఆ లేఖను రాసినట్లు వెల్లడించారు. త్వరలోనే తన సంతకంతో ఉన్న కాపీని సీఎం కార్యాలయానికి కూడా పంపనున్నట్లు వెల్లడించారు. ఆ లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు.
ఇరకాటంలో మహా సర్కారు..
పరమ్బీర్ రాసిన లేఖలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ముఖ్పై తీవ్ర విమర్శలు చేశారు. నెలకు రూ.100 కోట్లను వసూలు చేయాల్సిందిగా వాజేకు అనిల్ దేశ్ముఖ్ లక్ష్యంగా నిర్ణయించారని పేర్కొన్నారు. వీటిల్లో దాదాపు 60 కోట్ల వరకు ముంబయిలోని పబ్లు, రెస్టారెంట్ల నుంచి వసూలు చేసి..ఇతర మార్గాల్లో మిగిలిన మొత్తం వసూలు చేయాలని సూచించినట్లు పరమ్బీర్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను సీఎం ఠాక్రే, డిప్యూటీసీఎం అజిత్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్లకు వివరించినట్లు పేర్కొన్నారు. దీనిపై అనిల్ దేశ్ముఖ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్ తప్పించుకొనేందుకు ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యల్లో భాగంగా ఆ లేఖ పరమ్బీర్ సింగ్ సంతకంతో కానీ, అధికారిక ఈ మెయిల్ నుంచి కానీ రాలేదని పేర్కొనింది. దీనిపై దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. దీనిపై నేడు పరమ్బీర్ సింగ్ ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ తాను సీఎంకు లేఖ రాసినట్లు వెల్లడించారు. తన సంతకంతో ఉన్న లేఖను సీఎంవోకు పంపిస్తానని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా