మోటారు బిగించడానికి వెళ్లి బావిలో ఇరుక్కున్న వ్యక్తులు
బావిలో మోటారు బిగించడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు లోతైన గుంతలో చిక్కుకున్న ఘటన హరియాణలోని చోటుచేసుకుంది. 24 గంటలు నుంచి సహాయక చర్యలుకొనసాగుతున్నాయి.
చండీగఢ్: బావిలో మోటారు బిగించడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అందులో చిక్కుకున్న ఘటన హరియాణలో చోటుచేసుకుంది. వారిని రక్షించేందుకు 24 గంటలకుపైగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం లేకపోయింది. పోలీసులు కథనం ప్రకారం... హిసార్లోని సహర్వా గ్రామానికి చెందిన జైపాల్, జగదీష్ మోటారు బిగించే నిమిత్తం సమీప బావిలోకి దిగారు. 50 అడుగుల లోతున్న బావిలో కొంతభాగం లోపలికి వెళ్లారు. అక్కడే ఇరుక్కుపోయారు. ఈ ఘటనపై గ్రామస్థులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వారిని రక్షించేందుకు జేసీబీ యంత్రాలు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనా స్థలికి చేరుకుంది. రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్