మోటారు బిగించడానికి వెళ్లి బావిలో ఇరుక్కున్న వ్యక్తులు

బావిలో మోటారు బిగించడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు లోతైన గుంతలో చిక్కుకున్న ఘటన హరియాణలోని చోటుచేసుకుంది. 24 గంటలు నుంచి సహాయక చర్యలుకొనసాగుతున్నాయి.

Published : 23 May 2022 11:45 IST

చండీగఢ్‌: బావిలో మోటారు బిగించడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అందులో చిక్కుకున్న ఘటన హరియాణలో చోటుచేసుకుంది. వారిని రక్షించేందుకు 24 గంటలకుపైగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం లేకపోయింది. పోలీసులు కథనం ప్రకారం... హిసార్‌లోని సహర్వా గ్రామానికి చెందిన జైపాల్‌, జగదీష్‌ మోటారు బిగించే నిమిత్తం సమీప బావిలోకి దిగారు. 50 అడుగుల లోతున్న బావిలో కొంతభాగం లోపలికి వెళ్లారు. అక్కడే ఇరుక్కుపోయారు. ఈ ఘటనపై గ్రామస్థులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వారిని రక్షించేందుకు జేసీబీ యంత్రాలు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం కూడా ఘటనా స్థలికి చేరుకుంది. రెస్కూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని