వృద్ధుల్లో మరింత సమర్థంగా ఆ రెండు వ్యాక్సిన్లు
కరోనాను నివారించేందుకు అన్నిదేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. భారత్తో సహా అనేక దేశాలు
లండన్: కరోనాను నివారించేందుకు అన్నిదేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. భారత్తో సహా అనేక దేశాలు ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. 70 అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వృద్ధుల్లో ఫైజర్, ఆక్స్ఫర్డ్కు చెందిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. కరోనా వైరస్ వల్ల వచ్చే తీవ్ర ఇన్ఫెక్షన్ కారకాలను ఇవి నిరోధించగలిగాయని తెలిపింది.
80 ఏళ్లు దాటి కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్సి పొందుతున్న వారు, మరణాల రేటును పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ)కి చెందిన పరిశోధకులు వేర్వేరుగా సమీక్షించారు. సింగిల్డోస్ వ్యాక్సిన్ తీసుకుని 14 అంతకంటే ఎక్కువ రోజులైన తర్వాత కరోనా సోకిన వారికి కోలుకునే సామర్థ్యం 80శాతం పెరిగిందని తెలిపారు. వారంతా ఆస్పత్రి వెళ్లకుండానే కేవలం 3-4 వారాల్లో సాధారణ జీవనానికి వచ్చేశారని తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ మరణాల రేటును 83శాతం వరకూ తగ్గించగలుగుతోందని తెలిపారు.
‘‘ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకున్న వృద్ధులు కొవిడ్ బారిన పడితే అది తీవ్ర వ్యాధులకు దారి తీయడాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. ఇక్కడ ప్రజలందరూ మరోవిషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా తగిన జాగ్రత్తలతో బయటకు వెళ్లాలి. మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ఇంకా కొన్నాళ్ల పాటు కొనసాగించాలి’ అని పీహెచ్ఈ హెడ్ రామ్సే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.