India Corona: కొనసాగుతోన్న వ్యాప్తి.. 8 వేలు దాటిన కొత్త కేసులు..!

దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కొత్త కేసులు 8 వేలకు పైగా వెలుగుచూశాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, హరియాణాలో మహమ్మారి విజృంభిస్తోంది.

Updated : 11 Jun 2022 10:07 IST

40 వేల పైనే బాధితుల సంఖ్య 

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కొత్త కేసులు 8 వేలకు పైగా వెలుగుచూశాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, హరియాణాలో మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో క్రియాశీల కేసులు 40 వేల మార్కును దాటేశాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...

శుక్రవారం 3.44 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 8,329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 103 రోజుల తర్వాత ఈ స్థాయి వ్యాప్తి కనిపించింది. పాజిటివిటీ రేటు వరుసగా మూడోరోజు రెండు శాతం(2.41 శాతం) పైనే నమోదైంది. మహారాష్ట్రలో 3,081 మందికి కరోనా సోకగా.. ఒక్క ముంబయిలోనే ఆ సంఖ్య 1,956గా ఉంది. దాంతో ఆ నగరంలో పాజిటివిటీ రేటు 12.74 శాతానికి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేరళలో 2,415, దిల్లీలో 655 మంది వైరస్ బారినపడ్డారు. 2020 ప్రారంభం నుంచి 4.32 కోట్లకు పైగా కొవిడ్ కేసులొచ్చాయి. 

* తాజా విజృంభణతో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య(క్రియాశీల కేసులు)40,370కి చేరింది. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.09 శాతంగా నమోదైంది. 

* 24 గంటల వ్యవధిలో 4,216 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.69 శాతానికి పడిపోయింది. నిన్న 10 మంది మరణించారు.  

* నిన్న 15.08 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 194.9 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని