Children Vaccine: 5-12 ఏళ్ల పిల్లలకు త్వరలోనే టీకా..?
5 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన కార్బెవాక్స్, కొవాగ్జిన్ వినియోగ అనుమతులపై నిర్ణయం తీసుకునేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) గురువారం భేటీ అయ్యింది.
కార్బెవాక్స్, కొవాగ్జిన్ చిన్నారుల టీకాలపై నిపుణుల కమిటీ భేటీ
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి మళ్లీ మొదలవుతున్న వేళ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే యువకులకు వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టిన ప్రభుత్వం.. చిన్నారులకూ కరోనా వ్యాక్సిన్ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో 5 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన కార్బెవాక్స్, రెండేళ్ల చిన్నారుల కోసం తయారుచేసిన కొవాగ్జిన్ వినియోగంపై నిర్ణయం తీసుకునేందుకు నిపుణుల కమిటీ గురువారం భేటీ అయ్యింది. వీటి ఫలితాలను విశ్లేషించిన అనంతరం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కు సిఫార్సు చేయనుంది.
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా వినియోగం అనుమతి కోసం ఆ సంస్థ ఇదివరకే దరఖాస్తు చేసుకొంది. ఈ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలను విశ్లేషించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ (SEC) గురువారం భేటీ అయ్యింది. వాటిని పరిశీలించిన ఎస్ఈసీ, వ్యాక్సిన్ వినియోగానికి డీసీజీఐకు సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు చిన్నారుల కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వినియోగ అనుమతి కోరుతూ ఆ సంస్థ కూడా గతంలో దరఖాస్తు చేసుకుంది. ఈ ఫలితాలను కూడా గురువారం నాటి భేటీలో సబ్జెక్టు నిపుణుల కమిటీ విశ్లేషించినట్లు సమాచారం. ఒకవేళ వీటి వినియోగానికి ఎస్ఈసీ సిఫార్సు చేస్తే మాత్రం చిన్నారుల టీకా పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ అతి త్వరలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లల కోసం ప్రస్తుతం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాను 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటులోనూ ఇది అందుబాటులో ఉంది. 12-14 ఏళ్ల పిల్లలకు ఇస్తున్న కార్బెవాక్స్ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లోనే ఉందుబాటులో ఉంది. తాజాగా దేశంలో కరోనా ఉద్ధృతి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్ల చిన్నారులకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా