కరోనాతో కలిసి జీవించాల్సిందే: ట్రంప్
కరోనా వైరస్తోపాటే కలిసి జీవించడాన్ని అమెరికన్లు నేర్చుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
వాషింగ్టన్: కరోనా వైరస్తోపాటే కలిసి జీవించడాన్ని అమెరికన్లు నేర్చుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. వైరస్ ప్రభావం తక్కువగానే ఉందన్న ఆయన, సాధారణ ఫ్లూ మాదిరిగానే దీన్ని కూడా భావించాలని అన్నారు. వైరస్ బారినపడిన ట్రంప్, ఆసుపత్రి నుంచి వైట్హౌస్కు చేరుకున్న మరునాడు కరోనాపై మరోసారి ఈ విధంగా స్పందించారు. ‘ఫ్లూ సీజన్ వస్తోంది. ఈ ఫ్లూ కారణంగా ప్రతిసంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాక్సిన్ ఉన్నప్పటికీ ఒక్కోసారి లక్షకుపైగా మరణాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు దేశాన్ని మూసివేసి ఉంచుతున్నామా? లేదు కదా, దానితోపాటే కలిసి జీవించడం నేర్చుకున్నాము. అదేవిధంగా కొవిడ్ వైరస్తోనూ కలిసి జీవించడం నేర్చుకోవాలి’ అని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు, కొవిడ్ మహమ్మారి గురించి ఎవరూ భయపడొద్దని.. మన జీవితాలపై వైరస్ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ప్రస్తుతం వైట్హౌస్లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు.
ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 74లక్షల కేసులు నమోదు కాగా 2లక్షల 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!