‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’
కరోనా సెకండ్ వేవ్ భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ వైరస్ వాయు వేగంతో వ్యాపిస్తుండటంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు,....
కొవిడ్ని జయిద్దాం.. భారత్ను గెలిపిద్దాం!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ వైరస్ వాయు వేగంతో వ్యాపిస్తుండటంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో ఎన్నడూలేనంతగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆస్పత్రుల్లో పడకల్లేవ్.. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవు.. చివరకు శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలకు సైతం చోటు దొరకని దుస్థితి అందరినీ కలచివేస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితులను సృష్టించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు, ఆరోగ్యరంగ నిపుణులు. అప్రమత్తతతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్పై పోరాటంలో జయం మనదేనంటున్నారు.
మాస్క్ మరవకండి
కరోనాపై పోరాటంలో మాస్క్ ధరించడమే తొలి అస్త్రం. కరోనా అలజడి మొదలైనప్పట్నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి లోపించడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రజలు రోజంతా మాస్క్లు పెట్టుకొని ఉండటం ద్వారా కరోనా వైరస్ గొలుసును కొన్ని వారాల్లోనే ఛేదించవచ్చని ఎపిడమాలజిస్టులు చెబుతున్నారు. సెకండ్ వేవ్లో కొవిడ్ విజృంభణ దృష్ట్యా ఇంట్లో ఉన్నా సరే ప్రజలు మాస్క్లు ధరించాల్సిన సమయం వచ్చిందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడినవారిలో ఎక్కువ మందిలో లక్షణాలు బయటపడకపోవడం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించదు. డబుల్ మాస్క్ ధరించడం మరింత మేలు చేస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. సర్జికల్ మాస్క్, దానిపైన వస్త్రంతో తయారుచేసిన మాస్క్ను ధరించడం వల్ల కరోనాను సమర్థంగా ఎదుర్కోవచ్చని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. కరోనాకు బ్రేకులు వేయడంలో మాస్కే శ్రీరామ రక్ష అని నిపుణులు పేర్కొంటున్నారు.
టెస్ట్.. టెస్ట్..టెస్ట్.. ప్లీజ్!
కొవిడ్ అనుమానిత లక్షణాలు కనబడగానే వెంటనే టెస్ట్లు చేయించుకోవడంలో వెనకాడొద్దు. ఆలస్యం చేస్తే రిస్క్లో పడినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందే మేల్కోనడం ద్వారానే ఈ వైరస్ ముప్పు నుంచి బయట పడొచ్చంటున్నారు. కరోనాను గుర్తించి దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టింగే ఏకైక మార్గమని నిపుణులంతా చెబుతున్నమాట. భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వైరస్ను కట్టడిచేసే వ్యూహాలు అమలు చేయడం మరింత తేలికవుతుంది. అంతేకాదు.. కరోనా తీవ్ర లక్షణాలతో ఆస్పత్రికి వెళ్తున్న రోగులను అడ్మిట్ చేసుకొనే ముందు కొవిడ్ రిపోర్టులు అడుగుతున్నారు. అప్పటికే టెస్ట్లు చేయించుకోకపోవడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన కీలక సమయం వృథా అవుతోంది. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలూ ఉన్నాయి. అందువల్ల అనుమానం వస్తే టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమం. కొవిడ్ టెస్ట్ ఫలితం కోసం వేచి చూడకుండా ఐసోలేట్ కావాలి.
స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలే లేని వారు సైతం పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వైరస్ బారిన పడకుండా మేలుచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ సంఖ్యలో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నాయి. మరోవైపు, దేశంలో కొవిడ్ టెస్టులు పెద్ద సమస్యగా మారింది. రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో టెస్టింగ్ కిట్లతో పాటు శాంపిల్స్ సేకరించే సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వేధిస్తుండటంతో మరింత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. శాంపిల్ సేకరించే కేంద్రాల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కొవిడ్ టెస్ట్ రిపోర్టు రావాలంటేనే కొన్ని రోజుల పాటు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్న దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటిచోట్ల కూడా ఇంటికి వెళ్లి స్వాబ్ సేకరించడం కష్టతరంగా మారింది.
వ్యాక్సినే బ్రహ్మాస్త్రం..
కరోనాపై యుద్ధంలో టీకాయే బ్రహ్మాస్త్రం. టీకా వేసుకోవడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని ఇప్పటికే అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. టీకా వేసుకున్న తర్వాత కరోనా పాజిటివ్గా వస్తున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటోంది. అందుకే వైద్యరంగ నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున టీకాలు వేయించుకోవాలని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదనే భరోసా లేనప్పటికీ ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు మాత్రం తక్కువ. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవల స్పుత్నిక్ వీ టీకాకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఈ రెండూ కరోనా తీవ్రత నుంచి కాపాడటంలో సమర్థంగా పని చేస్తున్నాయి.
రోగనిరోధక శక్తి పెంచుకోండి
మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శరీరానికి తగిన పోషకాహారాన్ని తీసుకోవడం ఈ సమయంలో ఎంతో ముఖ్యం. రోగనిరోధక శక్తిని ఇనుమడింప జేసుకోవడం ద్వారా కరోనా బారినుంచి కొంత వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, మాంసం వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను అనుసరించడం మేలు చేస్తాయి. ఈ క్లిష్ట సమయంలో ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ,బి,సి,డి,ఈ, జింక్ వంటి విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా వైరస్ ముప్పును తగ్గించుకోవచ్చు.
అత్యవసరమైతే తప్ప బయటకెళ్లొద్దు..
కరోనా విలయంతో హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక మనిషి మరో మనిషి దగ్గరకు వెళ్లాలంటేనే అనుమానం వెంటాడుతోంది. అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటకు వెళ్లొద్దు. పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలు, ఇతర వేడుకలకు దూరంగా ఉండండి. మీ స్నేహితులు, బంధువుల బాగోగులను ఫోన్లో తెలుసుకోండి. భయంతో వణుకుతూ బంధాల్ని దూరం చేసుకోవద్దు. మార్కెట్కు వెళ్లిన సమయంలో డబుల్ మాస్క్ పెట్టుకొని వెళ్లండి. ఇంటికి వచ్చాక కూరగాయలను శుభ్రంగా కడిగి వాడండి. ఇంటికి అవసరమయ్యే సరకుల కోసం ప్రతిసారీ తిరగే అవకాశం లేకుండా 15 రోజులు/ నెలకు సరిపడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఈ సంక్షోభ సమయంలో కొన్నాళ్ల పాటు ఇలాంటి ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారిపై విజయం సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM