No confidence: మెజార్టీ లేకున్నా ‘అవిశ్వాసం’.. ఇప్పటివరకు ఎన్నిసార్లు..?
లోక్సభలో తమకు మెజార్టీ లేదని తెలిసినప్పటికీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ‘ఇండియా’ కూటమి ప్రయత్నిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament) మణిపుర్ అంశాన్నే ప్రధానంగా లేవనెత్తుతొన్న విపక్ష పార్టీలు.. దీనిపై సుదీర్ఘ చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ అంశంపై హోంశాఖ మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం చెబుతుండగా.. ఇందుకు విపక్షాలు ససేమిరా అంటున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని డిమాండు చేస్తున్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో చివరి ఆయుధంగా ‘అవిశ్వాసం’ (No Confidence motion) ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్సభలో తమకు మెజార్టీ లేదని తెలిసినప్పటికీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ‘ఇండియా’ కూటమి ఎందుకు ప్రయత్నిస్తోంది..? ఇప్పటివరకు ఎంత మంది ప్రధాన మంత్రులు దీన్ని ఎదుర్కొన్నారు..? వంటి విషయాలను ఓ పరిశీలిస్తే..
ఎందుకీ అవిశ్వాసం..?
ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తిమంత రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం (No Confidence motion) ఒకటి. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయిన సమయంలో విపక్షాలు ఈ ఆయుధాన్ని తీస్తుంటాయి. దీని ద్వారా సభా అభిప్రాయాలను పరీక్షించే అవకాశం లభిస్తుంది. కొన్ని సమయాల్లో ఏకంగా ప్రభుత్వం దిగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టే ఈ తీర్మానానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ అనుమతినిస్తే, అనుమతించిన పది రోజుల్లోగా స్పీకర్ నిర్ణయించిన తేదీల్లో చర్చ (Discussion), దాని తరువాత ఓటింగ్ (Voting) జరుగుతాయి. ఓటింగ్లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే మంత్రిమండలి రాజీనామా చేస్తుంది.
విపక్షాలకు మెజార్టీ లేదని తెలిసినా..!
లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 272. కానీ అధికార ఎన్డీయేకి 300లకుపైగా సభ్యుల మద్దతు ఉంది. దీంతో విపక్ష పార్టీలు అవిశ్వాసం ప్రవేశపెట్టినా అది వీగిపోతుందనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ‘ఇండియా’ కూటమి ఇందుకు పావులు కదుపుతోంది. ఎందుకంటే, అవిశ్వాసాన్ని స్పీకర్ అనుమతిస్తే సభలో చర్చ, ఓటింగ్ జరుగుతుంది. దీంతో అనేక అంశాలపై ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం దక్కుతుందని వారి ఆలోచన. అందుకే చివరి ప్రయత్నంగా దీన్ని ప్రయోగించేందుకు ‘ఇండియా’ కూటమి సిద్ధమవుతోందని తెలుస్తోంది. చివరిసారిగా 2018లో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం ప్రవేశపెట్టగా.. అందులో ఎన్డీఏకు 325 ఓట్లు, విపక్షాల తీర్మానానికి 126 సభ్యుల మద్దతు లభించింది.
గతంలో అవిశ్వాస తీర్మానాల క్రమాన్ని చూస్తే..
- స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లోక్సభలో 27సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
- 1963లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. 1962లో చైనా యుద్ధంలో ఓటమి తర్వాత కాంగ్రెస్ నేత జె.బి.కృపలానీ దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయింది.
- ఎక్కువసార్లు ఈ తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధానిగా ఇంధిరాగాంధీ నిలిచారు. ఆమె ప్రభుత్వం 15సార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నప్పటికీ అన్నింటిలోనూ బయటపడ్డారు. అందులో నాలుగుసార్లు పశ్చిమబెంగాల్కు చెందిన జ్యోతిర్మయి బసు ప్రవేశపెట్టడం గమనార్హం.
- పి.వి.నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి మూడుసార్లు, మోరార్జీ దేశాయ్ రెండుసార్లు, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయీ, నరేంద్ర మోదీ ఒక్కోసారి దీన్ని ఎదుర్కొన్నారు.
- 2003లో వాజ్పేయీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.
- అవిశ్వాసం సందర్భంగా సుదీర్ఘకాలం చర్చ లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో జరిగింది. దాదాపు 24.34గంటల పాటు చర్చ జరిగింది.
- అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మొదటి ప్రధాని మొరార్జీదేశాయ్. 1979 జులై 16న జరిగిన తీర్మానంలో ఓటమి చెందడంతో ఆయన రాజీనామా చేశారు.
- 1999లో అటల్ బిహారి వాజ్పేయీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో నెగ్గింది. దీంతో వాజ్పేయీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది.
- 2018లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది. ఎన్డీఏకు 325 ఓట్లు రాగా, విపక్షాలకు 126 రావడంతో అది వీగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును దిల్లీకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. దాంతో రేపు ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
Prajwal Revanna: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది. -
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
ఝార్ఖండ్లోని సాహిబ్గంజ్కు చెందిన ఖలీల్ అన్సారీ.. తన 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. 15 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ స్టేషన్ హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గంలో ఉంది. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. -
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
బ్రాంచ్ ఫొటో తీసి, ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఎస్బీఐ(SBI) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
ఓ అల్లరి మూక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటన పశ్చిమ బెంగాల్ కుల్తాలీ గ్రామంలో చోటుచేసుకుంది. -
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కాగా కుట్రలు రచించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు నటుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో అరెస్టు చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు జాడలేకుండా పోయిన నిందితుడి తల్లి పోలీసులకు చిక్కారు. -
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
Nagpur Temperature: నాగ్పుర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. సెన్సర్ తప్పిదం వల్లే 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేసింది. -
అంచనాల కంటే ముందే వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. -
నడక.. జపం.. ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. రెండోరోజు కార్యక్రమ వీడియోలను భాజపా విడుదల చేసింది. -
రేపు లొంగిపోతా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. -
భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది. -
ఎయిరిండియా విమానం 24 గంటలు ఆలస్యం.. ఉక్కపోతతో స్పృహతప్పిన ప్రయాణికులు
దేశ రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. -
మలద్వారంలో 960 గ్రాముల బంగారం.. కేరళలో ఎయిర్హోస్టెస్ అరెస్ట్
కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి బంగారం అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది. -
సుప్రీం కొలీజియం నిర్ణయాల్లో జోక్యానికి దిల్లీ హైకోర్టు నిరాకరణ
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫార్సులను నిరాకరించడానికి కారణాలేమిటో సుప్రీంకోర్టు కొలీజియం సవివరంగా తెలియజేసేలా ఆదేశించాలని కోరుతూ రాకేశ్కుమార్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. -
150 ఏళ్లుగా రుతుపవనాల రాకలో మార్పులు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి. -
అడుగంటుతున్న ప్రధాన జలాశయాలు
దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతానికి పడిపోయినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ జలాశయాల్లో గత వారం 24 శాతం నీటిమట్టం ఉండేది. -
బిభవ్ కుమార్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్కు స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
-
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
-
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: విశాఖ కలెక్టర్