బెంగాల్ సినీరంగం అనాథగా మారింది
బెంగాలీ నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ యావత్తు భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని వైద్యులు..
సౌమిత్ర ఛటర్జీకి ప్రముఖుల నివాళి
ఇంటర్నెట్ డెస్క్: బెంగాలి నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ మరణవార్త యావత్తు భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని వైద్యులు తెలిపారు. ‘ఘరె బైరె’, ‘అరణ్యర్ దిన్ రాత్రి’, ‘చారులత’ చిత్రాలతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్: భారతీయ సినీరంగం దిగ్గజాల్లో ఒకరిని కోల్పోయింది. సౌమిత్ర ఛటర్జీ ముఖ్యంగా ‘అపు’ ట్రైయాలజీ, సత్యజిత్రేతో కలిసి నటించిన సినిమాలతో అభిమానులకు చెప్పలేనంత వినోదాన్ని పంచారు. భారతీయ సినీరంగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన నటనకు గానూ ఎన్నో పురస్కారాలు వరించాయి. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్వంటి పురస్కారాలను ఆయన సాధించారు. ఆయన కుటుంబానికి, సినీరంగానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను.
ప్రధాని నరేంద్ర మోదీ: సౌమిత్ర ఛటర్జీ మరణం ఎంతో బాధ కలిగించింది. ప్రపంచ సినిమా రంగానికి ఆయన మరణం తీరని లోటు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వాళ్ల సున్నితత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారాయన. ఆయన అభిమానులకు, కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ: సౌమిత్ర ఛటర్జీ దేశం గర్వించే నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత అయిన ఛటర్జీ మరణవార్త వినడం విచారకరం.
పశ్చిమ్ బంగాల్ సీఎం మమతా బెనర్జీ: ఫెలుడా ’ఇక లేరు. ‘అపు’ వీడ్కోలు చెప్పారు. సౌమిత్రా ఛటర్జీకి వీడ్కోలు. ఆయన ఒక లెజెండ్. ప్రపంచ సినిమా రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. బెంగాల్ సినీ ప్రపంచం అనాథగా మారింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాం.
భాజపా జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా: దిగ్గజ బెంగాలీ నటుడు సౌమిత్రా ఛటర్జీ మరణం తీవ్ర బాధను కలిగించింది. ఆయన తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ప్రశంసలు పొందాడు. ఆయన యువతరానికి స్ఫూర్తి. ఆయన కుటుంబానికి, అనుచరులకు నా సంతాపం. ఓం శాంతి.
కాంగ్రెస్ నేత శశిథరూర్: సౌమిత్రా ఛటర్జీ చేసిన సినిమాలు మనతో ఎప్పటికీ బతికే ఉంటాయి. కోల్కతా తన అభిమాన కుమారుడిని కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.