బిగ్బాస్-4: వారికి బంపర్ ఆఫర్లు
ఆదివారం బిగ్బాస్ సీజన్-4 అట్టహాసంగా ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి చేతుల మీదుగా విజేత అభిజీత్కు
ఇంటర్నెట్డెస్క్: ఆదివారం బిగ్బాస్ సీజన్-4 అట్టహాసంగా ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విజేత అభిజీత్కు ట్రోఫీతో పాటు, నగదు బహుమతిని అందించారు. కాగా, ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లలో కొందరికి బంపర్ ఆఫర్లు వచ్చాయి. దీంతో వారంతా ప్రస్తుతం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.
* ఫైనలిస్ట్ల్లో ఒకరైన సోహైల్ జాక్పాట్ కొట్టేశాడు. తన స్మార్ట్గేమ్తో ఫినాలేలో రూ.25లక్షలు సొంతం చేసుకున్నాడు. ఇక అందులోని నుంచి అనాథ శరణాలయానికి రూ.10లక్షలు ఇస్తానంటే, ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకోమని, అందుకు ప్రతిగా రూ.10లక్షలు తాను ఇస్తానని నాగార్జున ప్రకటించారు. ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి అయితే, సోహైల్ను పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు, సోహైల్ ఊతపదం ‘కథ వేరే ఉంటుంది’ తన సినిమాలో మేనరిజమ్గా పెట్టుకుంటానని అడిగారు. అంతే కాదండోయ్.. సోహైల్ తీసే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, ఆ చిత్రంలో చిన్న పాత్రలో నటించేందుకు అవకాశం ఇస్తావా? అని సోహైల్ను చిరు అడగటం గమనార్హం. దీంతో సోహైల్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
* మరో కంటెస్టెంట్ దివికి కూడా చిరంజీవి ఓ ఆఫర్ ఇచ్చారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తాను నటించనున్న ‘వేదాళం’ రీమేక్లో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇవ్వనున్నట్లు తెలిపారు. కేవలం ఈ ఒక్క పాత్రే కాకుండా భవిష్యత్లో మంచి పాత్రలు ఇవ్వాలని దర్శకులకు సూచిస్తానని అన్నారు. చిరుతో నటించే అవకాశం వచ్చిన దివి తెగ సంబరపడిపోయారు.
* యూట్యూబర్, డ్యాన్సర్ అయిన మెహబూబ్కు చిరు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఫినాలే సందర్భంగా సోహైల్ తనకు వచ్చిన రూ.25లక్షల్లో రూ.5లక్షలు మెహబూబ్కు ఇవ్వగా, అతను తిరిగి దాన్ని అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. ఈ విషయం తెలిసిన చిరంజీవి వేదికపైనే రూ.10లక్షల చెక్ను అందించారు.
* నటుడు కుమార్సాయి కూడా ఈ సీజన్ సందర్భంలో ఓ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. నాగార్జునతో సినిమా చేయాలని ఉందని, అందుకు తాను ఒక కథ సిద్ధం చేశానని ఎలిమినేషన్ సందర్భంగా చెప్పాడు. అందుకు నాగార్జున అంగీకారం తెలిపారు. ఫినాలే సందర్భంగా ఆ విషయం ప్రస్తావనకు రాగా, త్వరలోనే కథ వింటానని నాగ్ హామీ ఇచ్చారు.
* ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వ్యక్తి గంగవ్వ. యూట్యూబ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె బిగ్బాస్కు రావడం మరో విశేషం. అనారోగ్యం కారణంగా మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోయిన ఆమెకు సొంతింటి కలను నాగార్జున నెరవేరుస్తున్నారు. ఫినాలే సందర్భంగా ఇంటికి సంబంధించిన పనులు మొదలు పెట్టిన వీడియోను చూపించారు.
* చివరి వారం వరకూ ఇంట్లో ఉండి తనదైన శైలిలో ఎంటర్టైన్ చేసిన కథానాయిక మోనాల్. ఇప్పటికే ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్బాస్ తర్వాత పలువురు దర్శక-నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు వేచి చూస్తున్నారని చిరంజీవి స్వయంగా చెప్పడంతో మోనాల్ ఆనందానికి అవధులు లేవు.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!