సోదరుడికి కరోనా.. ఎంతో భయపడ్డా: రామ్
2020 ఏడాది అందరిలాగే తనకి కూడా విభిన్నమైన అనుభూతులు సొంతం చేసిందని నటుడు రామ్ పోతినేని అన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్బాయ్ చెప్పనున్న నేపథ్యంలో.. 2020లో తన జీవితం ఏవిధంగా గడిచిందనే విషయాన్ని...
హైదరాబాద్: 2020 ఏడాది అందరిలాగే తనకి కూడా విభిన్నమైన అనుభూతులు సొంతం చేసిందని నటుడు రామ్ పోతినేని అన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్బై చెప్పనున్న నేపథ్యంలో.. 2020లో తన జీవితం ఏవిధంగా గడిచిందనే విషయాన్ని తాజాగా రామ్ వెల్లడించారు.
‘కరోనా కారణంగా ఈ ఏడాది నా జీవితంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో కొన్ని మంచివి. మరికొన్ని చెడ్డవి. ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉండే నేను లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడం వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. కొన్నినెలలపాటు ఇంట్లోనే కూర్చొవడం కొన్నిసార్లు నాకెంతో చిరాకుగా అనిపించింది. అలాగే ఈ ఏడాది నా జీవితం అనుకున్నంత సాఫీగా జరగలేదు. ఎందుకంటే, మా కుటుంబం కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంది. నా సోదరుడు, అమ్మ కొవిడ్-19 బారినపడ్డారు. ఆ విషయం నన్ను ఎంతగానో బాధపెట్టింది, భయపెట్టింది. నా సోదరుడిలో కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువగానే కనిపించాయి. అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కరోనాకి ఇంకా వ్యాక్సిన్ రానందువల్ల కొత్త సంవత్సరం వచ్చినా సరే మనం జాగ్రత్తగానే ఉండాలి’ అని రామ్ అన్నారు.
‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ విజయం తర్వాత రామ్ కథానాయకుడిగా నటించి యాక్షన్ థ్రిల్లర్ ‘రెడ్’. ‘తడమ్’ రీమేక్గా వస్తోన్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రెడ్’ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల్ని ఎంతో అలరిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.