‘800’ వివాదంపై స్పందించిన మురళీధరన్
విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం 800. ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అనేక కారణాలతో రాజకీయాల్లో చిక్కుకుంది. గతంలో ఆయన ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం.
ఇంటర్నెట్ డెస్క్: విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం 800. దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రాజకీయంగా వివాదంలో చిక్కుకుంది. గతంలో ఆయన ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. ముత్తయ్య మురళీధరన్, విజయ్ సేతుపతి స్టార్ స్పోర్ట్స్ తమిళ్ లో ఈ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. మురళీధరన్ పాత్రను ఆయన పోషించబోతుండటంతో తమిళనాడుకు చెందిన అనేక రాజకీయ పార్టీల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మురళీధరన్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
‘‘నేను జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నాను. ఇవి నాకు ఇవి కొత్త ఏమీ కాదు. కొన్ని వర్గాల ప్రజలు చిత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని నేను వివరణ ఇవ్వదలచుకున్నాను. నా జీవితం యుద్ధ భూమిలో మొదలైంది. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉండగానే నా తండ్రి చనిపోయారు. మా కుటుంబం కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఉంటూ మనుగడ సాగించడానికి అనేక కష్టాలు పడ్డాం. నేను ఈ ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కొన్నాను, క్రికెట్లో నిలదొక్కుకొని ఏవిధంగా విజయం సాధించాను అనేది ఈ చిత్రంలో చూపిస్తారు. శ్రీలంకలో తమిళుడిగా జన్మించటం నా తప్పా? నేను శ్రీలంక క్రికెట్ జట్టులో సభ్యుణ్ని. అందువల్ల నేను కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అనేక కారణాల వల్ల రాజకీయం చేస్తున్నారు. నేను మారణ హోమానికి మద్దతు ఇచ్చానని ఆరోపణలు చేస్తున్నారు. నేను 2009లో తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను. అ వ్యాఖ్యలు ఇప్పటికి నన్ను ఇబ్బందుల్లో నెట్టివేస్తున్నాయి. యుద్ధం 2009లో ముగిసింది. జీవితమంతా యుద్ధం చూసిన వారికి అది ముగియడమనేది మంచి మార్పు. మనం రెండు వైపులా ప్రాణాలు కోల్పోవడం లేదని తెలిసి నేను సంతోషంగా ఉన్నాను. నేను ప్రశాంత జీవితం గడపాలని ఎదురుచూస్తున్నాను. అందరి తమిళుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి నా కథను వెండితెరపై చెప్పాలనుకుంటున్నాను ’’అని అన్నారు.
ఈ సినిమా షూటింగ్ 2021 మొదటి భాగంలో ప్రారంభం కాబోతుంది. అదే సంవత్సరం చివరి నాటికి థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సీ.ఎస్.సామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటి అయిన రజిశ విజయన్ హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం ఉంది. అన్ని దక్షిణ భారతదేశ భాషలతో పాటు హిందీ, బెంగాళీ, సింహాళీస్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు