The 100: గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. మిషా నారంగ్ కథానాయిక. ధన్య బాలకృష్ణ, గిరిధర్, ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్ను కొణిదెల అంజనా దేవి శుక్రవారం విడుదల చేశారు. సాగర్ ఈ సినిమాలో విక్రాంత్ అనే నిజాయతీ గల ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఆయన్ని మానవ హక్కుల కమిషన్ విచారించడంతో టీజర్ మొదలైంది. నగర శివార్లలో సామూహిక హత్యలు జరగడం.. పోలీసుల విచారణలో వారంతా రౌడీ షీటర్లని తేలడం.. వారి హత్యల వెనుక విక్రాంత్ హస్తమున్నట్లు అర్థమవడం.. ఇలా ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ సాగిందీ ప్రచార చిత్రం. ఆఖర్లో ‘‘గెలవడమే గోల్ అయినప్పుడు ఆట ఎలా ఆడితే ఏంటి?’’ అంటూ సాగర్ చెప్పిన డైలాగ్ టీజర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో రానుంది.
కథ కుదిరిందా?
‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకురాలు సుధా కొంగర. ఇప్పుడామె అదే సినిమాని అక్షయ్ కుమార్తో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది త్వరలో విడుదల కానుంది. దీని తర్వాత ఆమె కథానాయకుడు సూర్యతో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఇది సెట్స్పైకి వెళ్లడానికి ఇంకొంత సమయం పట్టనుంది. అందుకే ఈ గ్యాప్లో మరో సినిమా పట్టాలెక్కించేందుకు సుధా ఓ కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని తాజాగా యువ కథానాయకుడు ధృవ్ విక్రమ్కు వినిపించినట్లు సమాచారం. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన కూడా సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ విషయంలో స్పష్టత వచ్చాక ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ధృవ్ ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ క్రీడా నేపథ్య చిత్రంలో నటిస్తున్నారు.
‘దీక్ష’ ప్రారంభం
ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకనిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్ కుమార్, భవ్యశ్రీ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకనిర్మాత రామకృష్ణగౌడ్ క్లాప్నివ్వగా, సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. డా.యోగానంద కృష్ణమాచార్య గౌరవ దర్శకత్వం వహించారు. జేవీఆర్, గురురాజ్లు చిత్రబృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘‘కొంచెం విరామం తర్వాత మరో మంచి కథ కుదరడంతో దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నా. కథాబలం ఉన్న చిత్రమిది. పురస్కారాలూ వస్తాయి. దీక్ష, పట్టుదలతో ఏ పని చేసినా తప్పకుండా విజయం దక్కుతుందనే అంశం ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. మే 1 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్తోపాటు, దుబాయ్లోనూ చిత్రీకరణ చేస్తాం. ఈ సినిమా తర్వాత క్రీడా నేపథ్యంలోనూ ఓ చిత్రం చేస్తాం. ఇకపై మా సంస్థలో వరుసగా సినిమాలు రూపొందుతాయి’’ అన్నారు. నటనకి అవకాశమున్న పాత్రల్ని పోషిస్తున్నామన్నారు నాయకానాయికలు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకటేశ్వర్లు, చిత్తజల్లు ప్రసాద్, రచయిత మేడ ప్రసాద్, నిర్మాత గిరి తదితరులు పాల్గొన్నారు.
భారత్-పాక్ యుద్ధ నేపథ్యం
భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధాల నేపథ్యంతో ఎన్ని చిత్రాలొచ్చినా ప్రేక్షకులు వాటిపై ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే కథాంశంతో ‘ఆపరేషన్ ట్రైడెంట్’ వస్తోంది. 1971లో భారత నావికాదళం పాకిస్థాన్ ఓడరేవు నగరం కరాచీపై చేసిన దాడి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. సన్షైన్ డిజీమీడియాతో కలిసి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వాణీలు ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతూ, అందుకు సంబంధించిన ఫొటోల్ని పంచుకున్నారు. ‘1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత నావికాదళం చేపట్టిన సాహోసోపేతమైన దాడి కథనంతో ఈ చిత్రం అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ చారిత్రక విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం’ అనే వ్యాఖ్యలు జోడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న... కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.