odela2: శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర రెండో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొదలైనట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దాదాపు 25రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో తమన్నాతో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ‘‘ఇదొక భిన్నమైన సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఆసక్తి రేకెత్తించే మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ స్వరాలందిస్తుండగా.. ఎస్.సౌందర్ రాజన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.