సుశాంత్ పంపిన ఆఖరి మెసేజ్ అదే..
బాలీవుడ్ కథానాయకుడు సుషాంత్సింగ్ రాజ్పుత్ మరణించి ఐదు నెలలు దాటింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆ చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న సుషాంత్ మిత్రుడు సిద్ధార్థ్ తాజాగా స్పందించాడు. సుషాంత్సింగ్రాజ్పుత్ స్నేహితుడు సిద్ధార్థ్గుప్తా
భావోద్వేగానికి గురైన సుశాంత్ స్నేహితుడు
హైదరాబాద్: బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణించి ఐదు నెలలు దాటింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆ చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్న సుశాంత్ మిత్రుడు సిద్ధార్థ్ తాజాగా స్పందించాడు. సుశాంత్ సింగ్రాజ్పుత్ స్నేహితుడు సిద్ధార్థ్గుప్తా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుశాంత్ మృతికి ఐదు రోజుల ముందు ఒకసారి కలుద్దామని సంక్షిప్త సందేశాలు పంపించుకున్నామన్నారు.
‘మనమింకా పరిపూర్ణత సాధించాలని సుశాంత్ అంటుంటేవాడు. ప్రతి రోజూ కొత్తదనం కోరుకునేవాడు. ఏదో సాధించాలని చెబుతుండేవాడు. అతని వల్లే నేను కూడా కొత్తగా ఆలోచించడం, కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవడం నేర్చుకున్నా. తన చుట్టుపక్కల వాళ్లను ఎంతో ప్రేమిస్తాడు. ఒక స్నేహితుడిగా నాకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. అతనికి సహచరుడిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని సిద్ధార్థ్ అన్నాడు.
ఇక వాళ్ల మధ్య జరిగిన ఆఖరి సంభాషణ గురించి మాట్లాడుతూ.. ‘‘నిన్ను, కుశల్ ఝవేరీ(సుశాంత్ మరో స్నేహితుడు) ఇద్దర్నీ కలవాలని అనిపిస్తోంది. మనం కలిసి తిరిగిన పాత రోజులు ఎంత బాగుండేవి..! కుశల్కు కూడా నా ప్రేమను వ్యక్తపరిచినట్లు తెలియజేస్తావు కదూ..!’ అని సుశాంత్ మెసేజ్ పంపించాడు. ఈ సందేశం వచ్చిన వెంటనే నేను కుశల్తో మాట్లాడాను. ‘సుశాంత్ సాధారణంగా ఇలాంటి సందేశాలు పంపించడు. కానీ.. కచ్చితంగా అక్కడ ఏదో జరుగుతోంది’ అని అతనితో చెప్పాను. ఆ వెంటనే.. ‘త్వరలోనే కులుసుకుందాం’ అని సుశాంత్కు కుశల్ రిప్లై ఇచ్చాడు. కానీ జరిగేదాన్ని మనం మార్చలేం’ అని సిద్ధార్థ్ చెప్పాడు. మిత్రుడి జ్ఞాపకాలు తలచుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు.
ఇదీ చదవండి..
‘సుశాంత్ నా చపాతీలు దొంగిలించేవాడు!
నటిపై గుర్రుగా ఉన్న సుశాంత్ ఫ్యాన్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.