కథ కుదిరిందా?

‘జాతిరత్నాలు’ లాంటి విజయం తర్వాత నవీన్‌ పొలిశెట్టి చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇంత వరకు స్పష్టత రాలేదు. నటి అనుష్కతో కలిసి ఓ సినిమా...

Updated : 20 Aug 2021 07:11 IST

‘జాతిరత్నాలు’ లాంటి విజయం తర్వాత నవీన్‌ పొలిశెట్టి చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇంత వరకు స్పష్టత రాలేదు. నటి అనుష్కతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చినా.. అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నవీన్‌ తదుపరి చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కల్యాణ్‌ శంకర్‌ అనే ఓ కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నారని సమాచారం. కల్యాణ్‌ ఇటీవలే నవీన్‌కు ఓ కథ వినిపించారని, ఆ కథాంశం విభిన్నంగా ఉండటంతో సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని, త్వరలో సినిమా పట్టాలెక్కించనున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని