Roja: పవన్ అభిమానులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: రోజా
‘భీమ్లానాయక్’ విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని పలువురు రాజకీయ ప్రముఖులు, పవర్స్టార్ అభిమానులు చేస్తోన్న కామెంట్లపై నగిరి ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు. అందరి పట్ల ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉందని అన్నారు....
తిరుపతి: ‘భీమ్లానాయక్’ విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని పలువురు రాజకీయ ప్రముఖులు, పవర్స్టార్ అభిమానులు చేస్తోన్న కామెంట్లపై నగరి ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు. అందరి పట్ల ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉందని అన్నారు. కొన్ని నెలల నుంచి సినిమా టికెట్ ధరలు ఒకేలా ఉన్నాయని.. ఏ ఒక్కరి కోసమో దాన్ని మార్చలేదని.. ఈ విషయాన్ని పవన్ అభిమానులు గుర్తు పెట్టుకోవాలని ఆమె తెలిపారు.
‘‘భీమ్లానాయక్’ విడుదలైన నాటి నుంచి ఎన్నో రకాల వివాదాలు చూస్తున్నాం. పవన్కల్యాణ్ను తొక్కేయడం కోసమే.. సినిమా టికెట్ ధరలపై కొత్త జీవోని ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయలేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారాలు జరగడం నిజంగానే బాధాకారం. సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల పవన్కు నష్టం కలుగుతుందని అంటున్నారు. ఆయనేమీ నిర్మాత కాదు కదా.. నష్టపోవడానికి..! ‘పుష్ప’, ‘అఖండ’ చిత్రాలకు ఎలాంటి ధరలైతే ఉన్నాయో అవే ధరలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అంతేకానీ, పవన్కల్యాణ్ సినిమా రిలీజ్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ధరల్లో మార్పులు చేయలేదనే విషయాన్ని ఆయన అభిమానులు గ్రహించాలి. ఇటీవల చిరంజీవి, మహేశ్బాబు, ప్రభాస్ వంటి సినీ ప్రముఖులు సినిమా టికెట్ ధరల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ విషయంపై హైకోర్టు సూచన మేరకు ఓ కమిటీ కూడా వేశారు. కొన్నిరోజుల క్రితమే తుది నిర్ణయం వెలువడాల్సింది. కాకపోతే అదే సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో అది కాస్త వాయిదా పడింది. ఇక్కడ ఎవరూ ఎవరికీ అన్యాయం చేయడం లేదని గుర్తుపెట్టుకోవాలి. సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని భావించినప్పుడు.. మిగతా హీరోల్లా మార్చిలో సినిమా రిలీజ్ చేసుకోవాల్సింది. లేదా, హైకోర్టు చెప్పినట్లు.. తమ చిత్రానికి టికెట్ ధరలు పెంచమని కోరుతూ ప్రతి జిల్లా జాయింట్ కలెక్టర్కు లేఖ రాయాల్సింది. అది వాళ్లు పరిశీలించి, ఓకే అనుకుంటే ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్లు. ఇవేమీ చేయకుండా సినిమా విడుదల చేశారు. తన పార్టీని నిలబెట్టుకోవడానికి పవన్ సినిమాతో రాజకీయం చేస్తున్నారు ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి’’ అని రోజా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!