నేనూ ఆ వివక్ష ఎదుర్కొన్నా!
‘‘ఓ నటిగా నేనెప్పుడూ నాతోనే పోటీ పడాలనుకుంటా. చేసే ప్రతి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటా’’ అంటోంది చాందినీ
‘‘ఓ నటిగా నేనెప్పుడూ నాతోనే పోటీ పడాలనుకుంటా. చేసే ప్రతి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటా’’ అంటోంది చాందినీ చౌదరి. ‘మను’, ‘హౌరా బ్రిడ్జి’ చిత్రాలతో కథానాయికగా ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ తెలుగు ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘కలర్ ఫొటో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సందీప్రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సుహాస్ కథానాయకుడిగా నటించారు. సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. ఈనెల 23న ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించారు చాందినీ. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘దర్శకుడు సందీప్ ఏడాది క్రితం ఈ కథతో నా దగ్గరకొచ్చారు. ఆయన కథ చెప్పిన తీరు.. దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, నా పాత్ర అన్నీ నాకు బాగా నచ్చాయి. దీంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పేశా. నిజానికి నాకు తనకీ ముందు నుంచే పరిచయం ఉంది. ఇద్దరం లఘు చిత్రాల ద్వారా తెరపైకి వచ్చిన వాళ్లమే. ఆయన ఈ కథ రాసుకున్నప్పుడే ఈ పాత్రకు నన్ను అనుకున్నారట’’
‘‘ఇది వర్ణ వివక్ష నేపథ్యంలో సాగే చిత్రం. 1990ల కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. దీంట్లో నేను మనసుకు నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడే స్వాతంత్య్ర భావాలున్న మధ్యతరగతి అమ్మాయిగా కనిపిస్తా’’
‘‘ఇది 90ల కాలం నాటి పాత్ర కావడంతో.. దీని కోసం అమ్మనే స్ఫూర్తిగా తీసుకున్నా. రంగును చూసి మనిషి వ్యక్తిత్వాన్ని, స్థాయిని అంచనా వేయడం సరికాదని ఈ చిత్రం ద్వారా సందేశమివ్వనున్నాం. నటిగా నాకెంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది’’.
‘‘సమాజంలో వర్ణ వివక్ష చాలా ఏళ్లుగా ఉంది. కెరీర్ తొలినాళ్లలో నేనూ ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నా. కొంతమంది ‘నువ్వు అంత పెద్ద రంగేంలేవ’న్నారు. కానీ, నేనెప్పుడూ ఆ మాటలు పట్టించుకోలేదు’’
‘‘నటిగా కెరీర్ ఆరంభంలో వాళ్లకి నచ్చాలి.. వీళ్లకి నచ్చాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ సినిమాలు చేశా. కానీ, దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదని తేలింది. నేనెప్పుడైతే నా మనసుకు నచ్చిన కథలు ఎంపిక చేసుకొని, సినిమాలు చేయడం మొదలు పెట్టానో.. అప్పటి నుంచే నటిగా నాకు సంతృప్తి దొరికినట్లయింది. ఇకపైనా ఇలాగే నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నా’’
‘‘వ్యక్తిగతంగా నేనెలాంటి చిత్రాలు చూడటానికి ఇష్టపడతానో.. అలాంటి మంచి సినిమాలే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఓ నటిగా చేసే ప్రతి చిత్రంతోనూ వైవిధ్యం చూపించాలనుకుంటున్నా. ప్రస్తుతం సుధీర్ వర్మ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నా. విష్వక్ సేన్కు జోడీగా ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ చేస్తున్నా. ఒక వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రంలోనూ నటిస్తున్నా’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.