సినీనటి రష్మికకు ఐటీ నోటీసులు

సినీనటి రష్మిక మందన్నకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు పంపింది. కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజ్‌పేటెలోని నివాసంలో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటితో పాటు రష్మిక కుటుంబసభ్యులు

Updated : 19 Jan 2020 08:00 IST

బెంగళూరు: సినీనటి రష్మిక మందన్నకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు పంపింది. కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజ్‌పేటెలోని నివాసంలో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటితో పాటు రష్మిక కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ మండపంలో జరిపిన తనిఖీల్లో రూ.25 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు రష్మిక తల్లిదండ్రులు చూపలేదు. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని రష్మికకు నోటీసులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని