కీర్తి సురేశ్ను ప్రశంసించిన రష్మిక
అగ్రకథానాయిక కీర్తి సురేశ్పై హీరోయిన్ రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది....
‘సైరస్’ నా పెంపుడు శునకం: ఈశ్వర్ కార్తిక్
హైదరాబాద్: అగ్రకథానాయిక కీర్తి సురేశ్పై హీరోయిన్ రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘పెంగ్విన్’ను వీక్షించిన రష్మిక చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ‘గత రాత్రి నేను ‘పెంగ్విన్’ చిత్రాన్ని వీక్షించాను. కీర్తి.. నీ నటన మర్చిపోలేకపోతున్నాను. ఎప్పటిలాగానే ఈ చిత్రంలోనూ నువ్వు చాలా అద్భుతంగా నటించావు. ఆపదల నుంచి కుటుంబాన్ని సైరస్(చిత్రంలో కీర్తిసురేశ్ పెంపుడు శునకం) రక్షించడం చాలా బాగుంది. ఈ సినిమా మాతృమూర్తులందరికీ సంబంధించిందని ఖచ్చితంగా చెప్పగలను. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్, నిర్మాత కార్తిక్ సుబ్బరాజుతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’ అని రష్మిక పోస్టు చేశారు.
సైరస్ నా పెంపుడు శునకం:
‘పెంగ్విన్’ చిత్రంలో సైరస్ అనే శునకం ఎంతో కీలకమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కథానాయిక కీర్తిసురేశ్కు పెంపుడు శునకంగా ఉంటూ ఆమెను అన్ని విధాలుగా రక్షిస్తుంటుంది. అయితే సైరస్ గురించి దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘సైరస్ అసలు పేరు మ్యాడీ. అది నా పెంపుడు శునకం. దానికి నా బాడీల్వాంగేజ్ బాగా తెలుసు. అలాగే నేను కూడా దాని ప్రతికదలికను పూర్తిగా అర్థం చేసుకోగలను. ‘పెంగ్విన్’ సినిమాలో సైరస్ పాత్ర కోసం శిక్షణ పొందిన శునకం కావాలని మొదట వెతికాను. కానీ దొరకలేదు. అలాంటి సమయంలో షూటింగ్కి ముందు ఓ రోజు మ్యాడీని సెట్కి తీసుకువెళ్లి కొన్ని సీన్స్ చేయించాను. నాకెంతో అద్భుతంగా అనిపించింది. అందుకే సినిమాలో మ్యాడీనే తీసుకున్నాను. అది చాలా సహజంగా నటించింది’ అని ఈశ్వర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు