Rashmika: హిందీలో మరొకటి?
ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ నాయికల్లో ఒకరిగా మెరుపులు మెరిపిస్తోంది రష్మిక. ఇప్పుడీ జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్బై’
ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ నాయికల్లో ఒకరిగా మెరుపులు మెరిపిస్తోంది రష్మిక. ఇప్పుడీ జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్బై’ చిత్రాలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రష్మికకు హిందీలో మరో క్రేజీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’లో శ్రీవల్లిగా డీగ్లామర్ పాత్రలో నటించి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ కస్తూరి. ఇప్పుడా సినిమా నచ్చే నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు ఓ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కరణ్ నిర్మాణంలో పలు చిత్రాలు ముస్తాబవుతున్నాయి. వీటిలో ఓ సినిమా కోసం ఆమెని నాయికగా తీసుకోనున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఆ చిత్రం ఏంటి? అందులో నటించే స్టార్ ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. రష్మిక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తోంది. అలాగే ‘పుష్ప 2’లోనూ నటించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!