విక్రమ్‌.. ఆదిత్య కరికాలన్‌

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి

Published : 05 Jul 2022 06:00 IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా సోమవారం ఈ సినిమా నుంచి విక్రమ్‌ లుక్‌ విడుదల చేశారు. ఇందులో ఆయన ఆదిత్య కరికాలన్‌గా కనిపించనున్నారు. చోళ సామ్రాజ్యంలో అత్యంత శక్తిమంతమైన పాత్ర ఆయనదని చిత్రవర్గాలు తెలిపాయి. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా రూపొందిన చిత్రమిది. పదో శతాబ్దానికి చెందిన చోళుల సామ్రాజ్యంలో చోటు చేసుకున్న ఎన్నో ఆసక్తికర అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు. త్వరలో టీజర్‌ విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: తోట తరణి, ఛాయాగ్రహణం: రవి వర్మన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని