బ్లాక్‌బస్టర్‌ సినిమాకి సీక్వెల్ రానుందా?

అల్లు అర్జున్ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’....

Published : 07 Feb 2020 16:12 IST

టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డులను సైతం కొల్లగొట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. యూఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి బన్నీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారా? అంటే టాలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. 

‘అల.. వైకుంఠపురములో’ చిత్రీకరణలో ఉండగానే త్రివిక్రమ్‌తో కలిసి మరో సినిమా చేయాలని అల్లు అర్జున్‌ అనుకున్నారట. ఇప్పుడు, ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో దీనికే కొనసాగింపుగా మరో సినిమా తీస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై టాలీవుడ్‌లో రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. బన్నీ అభిమానులకు పండుగనే చెప్పాలి. మరి సీక్వెల్‌ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని