జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు.
ఎలమంచిలి ర్యాలీలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ తదితరులు
ఎలమంచిలి, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. గురువారం సాయంత్రం ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్తో కలిసి ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల బైక్లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి పాతజాతీయ రహదారి మీదుగా పుర వీధుల్లో సాగింది. ధర్మవరం, ఎర్రవరం, రేగుపాలెం గ్రామాల్లో కలియతిరిగింది. ఈ సందర్భంగా ధర్మవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేశ్ మాట్లాడుతూ ఘోరంగా ఓడిపోతానని జగన్కు తెలిసిపోయిందని, జైలుకు పోతానన్న భయంతో లండన్ వెళ్లిపోవడానికి వీసా తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కూటమికి ఎదురులేదని ఆయనకు తెలిసిపోయిందన్నారు. ముఖ్యమంత్రి పదవి పోయిన వెంటనే జగన్ జైలుకు పోవడం ఖాయమన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ. 4 వేలు పింఛను ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్నారు. ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తారన్నారు. సూపర్ సిక్స్ పథకాలను చూసి భయపడిపోయిన జగన్ ఇవన్నీ ఇవ్వలేమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆడపడుచులంతా కూటమి వెంటే ఉన్నారని, రాక్షస పాలన పోవాలంటే జగన్ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలన్నారు. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ మాట్లాడుతూ గాజుగ్లాస్, కమలం గుర్తులపై ఓటేసి కూటమి అభ్యర్థులైన తమ ఇద్దరినీ గెలిపించాలన్నారు. ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాలో కూటమి ప్రభుత్వం డబ్బులు వేస్తుందన్నారు. నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, పప్పల చలపతిరావు, బొద్దపు శ్రీను, గొర్లె నానాజీ, పిట్టా శ్రీనులు మాట్లాడుతూ విజయ్కుమార్, సీఎం.రమేశ్లను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కన్నబాబు పాలనకు చరమగీతం పాడాలన్నారు. వీరికి అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. ర్యాలీలో భాగంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ధర్మవరంలో వీరిద్దరినీ కొఠారు సాంబశివరావు, కొఠారు నరేష్, కాకివాని వీధిలో ఓగిబోయిన చిరంజీవి సత్కరించారు. కూటమి నాయకులు దాడి గంగాధర్, లాలం సోమినాయుడు, పల్లా సత్యనారాయణ, నైదాన రమేశ్, ఊడి బాబులు, కరణం రవికుమార్, సాంబ, గుర్రాల శేఖర్, పప్పు ఈశ్వరరావు, ఆడారి రమణబాబు, గంధం శివ, నగిరెడ్డి కాసుబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.