మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై యువత నిలదీత
సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. పొలాలు, రచ్చబండల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. పలువురు మేధావులు, ప్రతిపక్షాలు ఈ చట్టంపై వీడియోలు, ట్రోల్స్ చేస్తూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. యువత, విద్యావంతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పటి వరకు మా చేతికి ఇవ్వకముందే టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఇప్పుడు మా భూములను కూడా తనఖా పెట్టడానికే పట్టాలు తీసుకుంటున్నారా?’ అంటూ సర్కారును నిలదీస్తున్నారు. వైకాపా నాయకుల దందా స్టైలే అంత అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకొందరు మా కష్టం మీద మీ ఫొటో ఏంటని మండిపడుతున్నారు. పాస్ పుస్తకాలపై వేసే ఫొటోలు.. కరెంట్ బిల్లు, చెత్త పన్ను మీద ఎందుకు వేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. భూ వివాదాలపై కోర్టుకు కూడా వెళ్లలేని భూభక్షక చట్టం తెచ్చిన వైకాపాకు ఓటేస్తే మీ భూమితో మీకు రుణం తీరినట్లేనని హెచ్చరిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ట్రోల్స్
- మీ బిడ్డా మీ బిడ్డా అంటే ఏంటో అనుకున్నాం. ఆస్తి పత్రాల కోసం అనుకోలేదయ్యా!
- ఒక్క అవకాశం ఇస్తే పట్టాలపై మా ఫొటోలు లేకుండా చేశావు. ఇంకో అవకాశం ఇస్తే మా భూములే లేకుండా చేస్తావేమో..?
- రజినీకాంత్ నటించిన నరసింహ చిత్రంలోని ‘పెళ్లి కొడుకు వీడే కానీ.. వీడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాదీ అన్నటు’్ల.. ‘పొలం వీడిదే కానీ పత్రాలు ప్రభుత్వానివి’ అంటూ దాన్ని మార్చి విమర్శిస్తున్నారు.
- ‘జగనన్న కాలనీల పేరుతో సెంట్లు ఇచ్చిండు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ఎకరాలు లాగేస్తుండు’ అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
- ప్రతిపక్ష పార్టీలు రూపొందించిన వీడియోలో నటుడు, జనసేన నాయకుడు పృథ్వీ వైకాపా నాయకుడిలా నటిస్తారు. ఓ బాధితుడు వచ్చి నా భూమిని రాత్రికి రాత్రి మీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంటారా అని పృథ్వీని నిలదీస్తారు. దానికి బదులుగా భలే వాడివమ్మా నీ భూమి అయితే నిరూపించుకో అని బాధితుడికి సవాల్ చేస్తారు. కోర్టుకు వెళ్లి నిరూపించుకుంటానని బాధితుడు చెబుతుండగా.. ఆ నాయకుడు కలగజేసుకుని కోర్టుల్లో నడవదమ్మా.. మీ లాయర్ చెప్పలేదా? ఈ మధ్యల్నే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ వివాదాలేవైనా కోర్టులో నడవవు. దీని కోసం టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ (టీఆర్వో) ఉంటారు. భూమి నీదేనని ఆయన దగ్గర నిరూపించుకోవాలి. నువ్వు నిరూపించుకుంటానన్న అది కుదరదు. ఎందుకంటే వాడిని నియమించేది మేమే. కాబట్టి మేం చెప్పిందే వాడు వింటాడు. నువ్వు చేసేదేం లేదు కాబట్టి నువ్వే ఎంతకో కొంతకు సెటిల్ చేసుకుంటేే మంచిదని హెచ్చరిస్తారు. దీనితో దారులన్నీ మూసుకుపోయాయని అర్థమైన బాధితుడు నాకు ఆడపిల్ల ఉందయ్యా.. మాకున్న ఆధారం భూమి ఒక్కటే.. మీరేం చెబితే అదేనని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తారు. ఇలా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే ప్రజలకు జరిగే నష్టాలను వీడియోల రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు.
- ‘అతడు’ సినిమాలో మహేశ్ బాబు తాతగా నటించిన నాజర్ తన భూమిని కబ్జా చేసిన తనికెళ్ల భరణిని ‘ఇదేంటి నాయుడు?’ అని ప్రశ్నిస్తాడు. ‘కంచె అంటారు. ఇంగ్లిషులో ఫెన్సింగ్ అంటారని ఇప్పుడే ఎమ్మార్వో చెబుతున్నాడు’ అని భరణి బదులిస్తాడు. పక్కనే ఉన్న ఎమ్మార్వో కలగజేసుకుని ‘ఈ భూమి మీదే అనిపిస్తే కోర్టుకెళ్లండి అది సివిల్ కేసు అవుతుంది. మా మీద గొడవ చేస్తే క్రిమినల్ కేసు అవుతుంది. అదే నాయుడు లాంటోనితోని ఎందుకని భూమిని వదిలేస్తే సమయం మిగులుతుంది’ అని చెబుతారు. వైకాపా అధికారంలోకి వస్తే ఇలాగే ప్రజల భూములు లాక్కుంటారని ఆ సన్నివేశంతో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్