నారీ.. సమర భేరీ
తేజస్వి పొడపాటి, గాయత్రి సందిరెడ్డి, ఉండవల్లి అనూష, రాయపాటి అరుణ.. రాష్ట్రంలో వైకాపా సాగించిన అరాచకాలను ఎండగట్టడంలో వీళ్లు అసలు సిసలైన నారీమణులు.
అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టడంలో ఫైర్ బ్రాండ్స్
వైకాపా నాయకుల వేధింపులకు లొంగని తత్వం
ప్రజల్ని చైతన్య పరచడంలో తమ వంతు కృషి
ఈనాడు - అమరావతి
తేజస్వి పొడపాటి, గాయత్రి సందిరెడ్డి, ఉండవల్లి అనూష, రాయపాటి అరుణ.. రాష్ట్రంలో వైకాపా సాగించిన అరాచకాలను ఎండగట్టడంలో వీళ్లు అసలు సిసలైన నారీమణులు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, పార్టీ వాయిస్ను వినిపించడంలో ఫైర్ బ్రాండ్స్. ప్రశ్నిస్తే పోలీసు, సీఐడీ కేసులతో జగన్ ప్రభుత్వం భయపెడుతుందని తెలిసినా.. బెదరకుండా తమ వాయిస్ను నిక్కచ్చిగా వినిపిస్తున్నారు. ట్రోల్స్తో వేధింపులకుదిగే వైకాపా సోషల్ మీడియాను ఏమాత్రం ఖాతరు చేయకుండా, ధైర్యంగా ఎదుర్కొంటున్న రాజకీయ రుద్రమదేవిల్లా గుర్తింపుపొందారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయడం, చర్చా కార్యక్రమాల్లో పాల్గొని ధైర్యంగా మాట్లాడటం, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ రకంగా ఎన్డీఏకు వీళ్లు అనధికార స్టార్ క్యాంపెయినర్లు. వీరి పోస్టులు, చర్చా కార్యక్రమాల్లో ప్రస్తావించిన అంశాలు ఎందరినో ఆలోచింపజేస్తుంటాయి. అధికారపార్టీ నేతలకు గుబులు పుట్టిస్తుంటాయి.
తేజస్వి కౌంటరిస్తే.. అధికార పార్టీకి మంట ఖాయం
తెలుగు ప్రొఫెషనల్స్ విభాగం అధ్యక్షురాలైన తేజస్వి పొడపాటి.. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై మాటల తూటాలతో విరుచుకుపడుతూ ఔరా అనిపిస్తారు. భూమి ఫౌండేషన్ నిర్వహించే ఈమె.. జగన్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అరాచకాలపై తనదైనశైలిలో ప్రతి సభలోనూ ఛలోక్తులు, ప్రాసలతో నిలదీస్తారు. చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులతో కలిసి వివిధ రూపాల్లో హైదరాబాద్లో నిరసనలు తెలపడంలో ముఖ్య భూమిక పోషించారు. ధర్నాలు, క్యాండిల్ ర్యాలీలు, లెట్స్ మెట్రో, చలో రాజమహేంద్రవరం వంటి కార్యక్రమాలు, గచ్చిబౌలి స్టేడియంలో ‘సీబీఎన్ గ్రాటిట్యూట్’ పేరిట భారీ సభ నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ‘మేము సైతం.. మన రాష్ట్రం కోసం’ అంటూ ఐటీ ఉద్యోగులతో కలిసి ప్రతి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ‘ఇన్ని చదువుల విప్లవాలు కనిపిస్తుంటే చంద్రబాబు కడుపు మండదా అంటూ’ సీఎం జగన్ కొద్దిరోజుల కిందట ఓ సభలో వ్యాఖ్యానించగా.. దీనికి తేజస్వి ఓ సమావేశంలో దీటైన కౌంటర్ ఇచ్చారు. అన్నంపెట్టే అన్న క్యాంటీన్ మూసేస్తే మండదా.. అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీశారు. ‘నూకలిచ్చి వండుకొని ఒక్కపూటలో అరిగిపోయాక.. మళ్లీ చేయిచాచేలా చేసే మనస్తత్వం చంద్రబాబుది కాదు. ఒక వ్యక్తిని చదివించి, ఉద్యోగం ఇప్పిస్తే.. ఓ కుటుంబం పూర్తిగా పేదరికం నుంచి బయటపడేలా భవిష్యత్ ఆలోచనలే ఆయన మదిలో నిరంతరం ఉంటాయి’ అంటూ మరో సమావేశంలో పేర్కొన్నారు.
గాయత్రి మాటలు.. తూటాలే
సీఎం జగన్, పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలపై విజయవాడకు చెందిన తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి సందిరెడ్డి మాటల తుటాలతో నిలదీస్తారు. చంద్రబాబు, ఇతర తెదేపా నేతలపై అధికారపార్టీ నాయకులు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొడుతుంటారు. పవన్కల్యాణ్ తెదేపాకు మద్దతుగా నిలుస్తానని చెప్పినప్పటి నుంచి.. ఆయనపై వైకాపా చేసిన ట్రోలింగ్పై అదేస్థాయిలో బదులిచ్చారు. ప్రతి అంశంపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ తెదేపా వాదనను బలంగా వినిపిస్తుంటారు.
- జగన్కు గులకరాయి తగిలి గాయమైందని, ఇది హత్యాయత్నమంటూ సాక్షి పత్రికలో రాయడంపై గాయత్రి తనదైన శైలిలో వీడియో పోస్ట్చేశారు. ‘అసలు హత్యాయత్నానికి ఎలాంటి ఆయుధాలు వాడుతారో.. అవినాష్రెడ్డిని అడిగితే చెబుతారు. సీబీఐ ఛార్జిషీట్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. వివేకం సినిమాలో క్లియర్గా ఉంది. దానిని ఓసారి చూడండి’ అంటూ కడిగిపారేశారు.
- వై.ఎస్.షర్మిల పసుపు రంగు చీర కట్టుకున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై.. స్పందిస్తూ ‘సీఎం హోదాలో ఉండి, సొంత చెల్లి చీరపై రాజకీయం చేశారు. సీఎం పదవి కాపాడుకోవడం కోసం ఇంతలా దిగజారిపోతారా?’ అంటూ విరుచుకుపడ్డారు.
పోస్టులతో కడిగిపారేసే అనూష
సామాన్య మహిళ అయిన ఉండవల్లి అనూష.. వైకాపా ప్రభుత్వ తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయిదేళ్లుగా ఐ-టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ.. వైకాపా నేతల తీరును, ప్రభుత్వ విధానాలను కడిగిపారేస్తున్నారు. ఈమెను వైకాపా సోషల్ మీడియా పెద్దఎత్తున ట్రోలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ అనూష వీటికి బెదిరిపోకుండా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. అనూషపై వైకాపా నేతలు 4 కేసులు పెట్టారు. ఒకటి ఎప్ఐఆర్ కూడా అయ్యింది. అయినా అధికార పార్టీ అరాచకాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు.
- గన్నవరం తెదేపా కార్యాలయంపై వల్లభనేని వంశీ వర్గీయులు దాడిచేయడంపై స్పందిస్తూ.. ‘మిమ్మల్ని ఏదో అన్నారని మీ కార్యకర్తలు దాడిచేశారు. మీరు నారా భువనేశ్వరిని ఎన్నో అన్నారు. అందుకు తెదేపా వాళ్లు ఏం చేయాలి? తెదేపా అధికారంలోకి వచ్చాక వడ్డీకి చక్రవడ్డీ కలిపి ఇవ్వనున్నాం’ అని హెచ్చరించారు.
- ‘అరగంట, గంట ఆడియోలు బయటకు వచ్చాక.. మీరు వాటిని సమర్థించుకునేలా ఎలా మాట్లాడుతున్నారు నాయనా’ అంటూ మంత్రి అంబటిపై ఓసారి సెటైర్లతో వీడియోపెట్టారు.
బాణాల్లా దూసుకెళ్లే.. అరుణ ప్రసంగాలు
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఏ సభలో ప్రసంగించినా, ఏ చర్చా కార్యక్రమంలో మాట్లాడినా.. అందరిని ఆలోచింపజేస్తారు. పవన్కల్యాణ్ అవిశ్రాంతంగా పోరాడుతున్న తీరు, ఆ పార్టీని నడుపుతున్న వైనం, ఎన్డీఏను అధికారంలోకి ఎందుకు తెచ్చుకోవాలి? వంటి అంశాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లేలా మాట్లాడతారు. మంత్రులు, వైకాపా నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సమర్థంగా తిప్పికొడుతుంటారు. తనదైన శైలిలో వ్యంగ్యంగా, చమత్కారం జోడిస్తూ విమర్శలు చేస్తుంటారు.
- ‘పదిమంది ఒక్కటై జగన్పైకి ఎందుకు వస్తున్నారు?’ అని ఓ చర్చా కార్యక్రమంలో వైకాపా మద్దతుదారు ప్రశ్నించగా.. ‘ఓ సైకో బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే మంచి వాళ్లంతా ఒక్కటి కావాలని, పిచ్చోడిని ఏ ఒక్కరో నియంత్రించలేరు కదా? పది మంది కలిస్తేనే ఆపగలరు’ అని బదులిచ్చారు.
- ‘చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?’ అని వైకాపా సిద్ధం సభలో జగన్ వ్యాఖ్యానిస్తే.. ‘చొక్కా ఒక్కటే కాదు. ప్యాంటు, చెడ్డీ, బనియన్ కూడా మడత పెట్టి సూట్కేస్లో సర్దుకొని సిద్ధంగా ఉండండి. ఎన్నికల తర్వాత చర్లపల్లి జైలులో ఉపయోగపడతాయి’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా