బడే మియా ఛోటే మియా!

బాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌, యువ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కలిసి ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారట. ఈ

Published : 08 Jan 2022 03:50 IST

బాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌, యువ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కలిసి ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాని రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘బడే మియా ఛోటా మియా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలుస్తోంది. ‘‘యాక్షన్‌ చిత్రాల్లో అదరగొట్టే అక్షయ్‌, టైగర్‌లలోని హీరోయిజాన్ని మరింత బాగా తెరపై చూపించే కథ ఇది’’ అని అలీ అబ్బాస్‌ సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లి, 2023కి విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. యాక్షన్‌తో పాటు కామెడీ ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా విశేషాలతో అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని