ఏపీలో షూటింగ్లకు అనుమతిచ్చారు: చిరు
ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. జులై 15వ తేదీ తర్వాత ఏపీలో షూటింగ్లు చేసుకునేందుకు సీఎం అంగీకరించారని చిరు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మంగళవారం సీఎం జగన్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. అగ్ర నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్బాబు, సి.కల్యాణ్, దిల్రాజు తదిరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎం జగన్తో వారు చర్చించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో సమావేశం అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో కలిసి ఏడాది కాలంగా సీఎం జగన్ను కలవాలని అనుకున్నాం. ఇప్పుడు కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే వచ్చాం. రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ రాణించడానికి వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపాం. లాక్డౌన్ సమయంలో షూటింగ్లు స్తంభించిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే షూటింగ్లకు అనుమతి ఇచ్చింది. జూన్ 15 తర్వాత చిత్రీకరణలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని సమస్యలను ఏపీ సీఎం జగన్కు దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు ఆయన్ను కలిశాం. అన్నింటినీ సీఎం జగన్ సావధానంగా విని, సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందుకు సంబంధించిన విధివిధానాలను మంత్రి నాని, ఇతర అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు’’
‘‘లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడి పునః ప్రారంభం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్ల మినిమం పవర్ టారిఫ్లను రద్దు చేయాలని కోరాం. దాని కూడా సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఇక గత కొంతకాలంగా నంది అవార్డులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని ప్రతి నటుడు, టెక్నీషియన్ కోరుకుంటాడు. దీని కూడా 2019-20 సంబంధించిన అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ వేడుక కూడా ఈ ఏడాదే జరుగుతుందని ఆశిస్తున్నా. అలాగే టికెటింగ్లో పారదర్శకత ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు’’
‘‘చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో సినిమాను దాని బట్టి టికెట్ ధర పెరుగుతుంది. దీని వల్ల భారీ సినిమాలు తీసే నిర్మాతలకు మేలు జరుగుతుంది. ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం వైఎస్ హయాంలో విశాఖలో 300 ఎకరాలను కేటాయించారు. దాన్ని పునః పరిశీలిస్తానని చెప్పారు. ఏపీలో సినిమాలు నిర్మించాలి. అవుట్ డోర్ యూనిట్లు పెట్టాలనుకునేవాళ్లకు అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలను విని, సానుకూలంగా స్పందించిన సీఎం జగన్కు చిత్ర పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన వెంట మంత్రి పేర్ని నాని, నాగార్జున, రాజమౌళి, సురేశ్బాబు, దిల్రాజు, సి.కల్యాణ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం