ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను: కేజీఎఫ్ హీరో
మన దగ్గర హీరో యశ్ అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టరు. కానీ కేజీఎఫ్ రాఖీభాయ్ అని చెబితే ఠక్కున గుర్తొచ్చే రూపం అతడిది. ఆ పాత్రకు తను తప్ప మరెవరు న్యాయం చేయలేరన్న రీతిలో నటించారు. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న
సినీ పరిశ్రమలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న యశ్
ఇంటర్నెట్ డెస్క్: మన దగ్గర హీరో యశ్ అంటే పెద్దగా ఎవరూ గుర్తుపట్టరు. కానీ కేజీఎఫ్ రాఖీభాయ్ అని చెబితే చటుక్కున గుర్తొచ్చే రూపం అతడిది. ఆ పాత్రకు తను తప్ప మరెవరూ న్యాయం చేయలేరన్న రీతిలో నటించారు. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న యశ్.. కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్నారు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన యశ్.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తయింది.
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. తను నటించిన తొలి చిత్రం ‘మొగ్గిన మనసు’. అది 2008 జులై 18న విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్గా రాధికా పండిట్ నటించారు. విశేషమేమిటంటే, రాధికా పండిట్.. యశ్ సతీమణి. ఈ చిత్రంతోనే వీరిద్దరు వెండితెరకు పరిచమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యశ్.. రాధికా ప్రేమించుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ‘మొగ్గిన మనసు’కి శశాంక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హీరోగా యశ్కు అవకాశాలు వరుస కట్టాయి. దీంతో కల్లారా సంతే, మొదలసాల, రాజధాని, కిరాతక, గూగ్లీ, రాజహులి వంటి సినిమాల్లో నటించారు. 2014లో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి బ్లాక్బాస్టర్ హిట్గా నిలిచింది. దీనిలోనూ రాధికా పండిట్ హీరోయిన్. ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్-1తో యశ్ ఆల్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్-2లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
సినీ హీరోగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన రోజును ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఏమీ లేని స్థాయి నుంచి తారస్థాయికి వచ్చానని చెప్పారు. కేజీఎఫ్ చాప్టర్-2 గురించి ప్రస్తావిస్తూ.. ఈ సినిమా షూటింగ్ కొంత మిగిలిపోయిందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని యశ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.