Biggboss 15: బిగ్బాస్ టైటిల్ విన్నర్.. ఎంత డబ్బు గెలుచుకున్నారంటే..?
బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్బాస్ సీజన్-15’ ఆదివారంతో ముగిసింది. బుల్లితెర, వెండితెరకు చెందిన 24 మంది సెలబ్రిటీలతో సుమారు 120 రోజులపాటు ఈ కార్యక్రమం విజయవంతంగా...
ముంబయి: బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్బాస్ సీజన్-15’ ఆదివారంతో ముగిసింది. బుల్లితెర, వెండితెరకు చెందిన 24 మంది సెలబ్రిటీలతో సుమారు 120 రోజులపాటు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్ చివరికి ‘బిగ్బాస్ 15’ టైటిల్ని ముద్దాడింది. తనకు ఈ విజయాన్ని అందించిన అభిమానులందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. విజేతగా నిలిచిన ఆమె ‘బిగ్బాస్-15’ ట్రోఫీతోపాటు క్యాష్ప్రైజ్గా రూ.40 లక్షలు అందుకున్నారు.
అంతేకాకుండా విశేష ప్రేక్షకాదరణ పొందిన హిందీ సీరియల్ ‘నాగిని’ తదుపరి సీక్వెల్లో(నాగిని-6) నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఆమె విజయం పట్ల పలువురు బుల్లితెర నటులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. 2015లో వచ్చిన ‘స్వరాగిణి’ ధారావాహికతో తేజస్వీ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ సీరియల్ హిట్ అయ్యాక ఆమె పలు ధారావాహికలు, రియాల్టీ షోలలో అవకాశాలు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?