MaheshBabu: ‘ఆచార్య’కు మహేశ్‌బాబు గొంతు సాయం..!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. దేవాలయాల ప్రాముఖ్య..

Updated : 23 Apr 2022 11:40 IST

జోరందుకున్న ప్రచారం.. ఫ్యాన్స్‌ ఎదురు చూపులు

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర పోషించారు. మరికొన్ని రోజుల్లో ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఆచార్య’లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సైతం భాగమైనట్లు, ఈ చిత్రానికి ఆయన వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు సమాచారం. చిరంజీవి, కొరటాల శివతో ఉన్న అనుబంధం కారణంగానే మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించేందుకు అంగీకరించినట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో అటు మెగా, ఇటు సూపర్‌స్టార్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేశ్‌ నటించిన ‘సర్కారువారి పాట’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరు ముఖ్య అతిథిగా పాల్గొనడం.. ఇప్పుడు చిరు చిత్రానికి మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ సాయం చేయడం.. ఇలా అగ్రహీరోల మధ్య ఉన్న స్నేహబంధాన్ని చూసి సినీ ప్రియులు సైతం సంతోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని