కంగనాకు కోర్టు సమన్లు ?

తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ  వార్తల్లో ఉంటోన్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు తాజాగా ముంబయి కోర్టు ఒక కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసింది.  మార్చి 1న జరిగే విచారణకు కోర్టులో హజరవ్వాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే

Published : 01 Feb 2021 15:42 IST

ముంబై: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు తాజాగా ముంబయి కోర్టు ఓ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసింది. మార్చి 1న జరిగే విచారణకు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే సుశాంత్‌సింగ్‌ మరణం తర్వాత కంగనా ఒక టీవీ షోలో పాల్గొంది. అందులో భాగంగా బాలీవుడ్‌లో ఒక కోటరీ ఉందని, అందువల్ల సినీరంగంలో కొత్తవాళ్లను ఎదగనివ్వరని, రచయిత జావేద్‌ అక్తర్‌ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జావేద్‌ అక్తర్‌.. కంగనాపై పరువునష్టం దావా వేశారు. దీంతో విచారణలో భాగంగా జూహూ పోలీసులు ఆమెను సంప్రదించారు. అయితే కంగనా విచారణకు సహకరించకపోవడంతో జావేద్‌ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న అంధేరి మేజిస్ట్రేట్‌ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో పూర్తి నివేదిక తయారుచేసి కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.

ఇవీ చదవండి!

సుదీప్‌కు ‘బూర్జ్‌ ఖలీఫా’ అరుదైన గౌరవం!

‘గల్లీబాయ్‌’ జంట మరోసారి?

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని