Kiara Advani: ఆ ఒక్క విషయంలో ఎలాంటి మార్పులేదు
‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు అభిమానులకు దగ్గరైంది బాలీవుడ్ కథానాయిక కియారా అడ్వాణీ.
‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు అభిమానులకు దగ్గరైంది బాలీవుడ్ కథానాయిక కియారా అడ్వాణీ. 2014లో ‘ఫగ్లీ’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె తన నటనకు మంచి ప్రశంసల్ని అందుకుటోంది. ఈ ఏడాది విడుదలైన ‘సత్యప్రేమ్ కీ కథా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. వచ్చే ఏడాదితో సినీరంగంలో పదేళ్లను విజయవంతంగా పూర్తి చేసుకోనున్న కియారా పంచుకున్న సంగతులు...
నాలుగు కాదు పది
నాతో కలిసి పని చేయాలనుకునే వారిని కలిసినప్పుడు, నన్ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుంటున్నారన్న విషయం తెలిసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పటివరకూ చాలా మారాయి. కానీ మొదటి నుంచి సినిమాల పట్ల నేను తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు కథలకు బదులు పది స్క్రిప్ట్లను ఎంచుకుంటున్నాను అంతే.
అది అనుభవం మాత్రమే
సినిమాలు చేయడం ఒక పెద్ద కమిట్మెంట్. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఉత్తేజకరమైన కథా కాదా అనేది ముందే చూసుకుంటాను. తెర వెనక ఎంతో మంది పెట్టుబడి, కష్టం, కృషి ఉంటుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చిత్రాలు చేయాలి. ఆ సినిమా ఎలా ఉన్నా, ఏం జరిగిన జీవితంలో ఎదురైన ఒక అనుభవంలాగే ఫీల్ అవుతాను.
సంతృప్తినిచ్చిన పాత్రలవి
మొదట్లో కథను ఎంచుకునే విషయంలో చాలా కష్టం అనిపించేంది. ఇప్పటికి కూడా(నవ్వుతూ). దాని ద్వారా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. ఏది చేసిన కొంచెం భిన్నంగా చేయాలనే ఆలోచనతో నాకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటాను. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’ సినిమాల్లోని పాత్రలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ పాత్రల ఎంపిక ద్వారా నా ఆలోచనల విధానం ఎలా ఉందని తెలిసింది. ఈ పాత్రలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి.
ఇక దానిపైనే మా దృష్టి
పెళ్లికాకముందు నుంచే సిద్ధార్థ్.. నేను మా బంధాన్ని కాపాడుకోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు నటీనటులుగా మాకున్న గుర్తింపును కాపాడుకోవడంపై దృష్టిపెట్టాం. సినీరంగంలో మాకు ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాం. దీని కోసం మేము చాలా కష్టపడ్డాం. మా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టి ప్రేక్షకుల అభిమానానికి దూరంగా ఉండాలనుకోవట్లేదు. మాపై వారికున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలని ఆశిస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
ఎన్టీఆర్ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
‘తుపాకీ పట్టి..’ బాక్సాఫీస్కు గురిపెట్టి!
కథానాయకులిచ్చే ప్రేమ గులాబీలు అందుకుంటూ.. వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నారు. తుపాకీ పట్టి యాక్షన్ తూటాలు పేలుస్తూ బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. -
పెళ్లి తేలికైన విషయం కాదు!
‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
బాహుబలి నుంచి యానిమేటెడ్ సిరీస్
ప్రభాస్ - రాజమౌళి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘బాహుబలి’ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడీ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ఓ యానిమేటెడ్ సిరీస్ రానుంది. -
సీమ కథతో తొలిసారి
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో ఓ సినిమా చేయనున్నారు. -
అందర్నీ మెప్పించడం సాధ్యం కాదు
‘కెరీర్లో జయాపజయాలు సహజం. అవి ఎంతమాత్రం నాపై ప్రభావం చూపించవు. ప్రేక్షకులు మెచ్చేలా నటించుకుంటూ వెళ్లడమే నా పని’ అంటోంది అలయా ఎఫ్. ఇటీవలే తను నటించిన ‘బడేమియా ఛోటేమియా’ భారీ వసూళ్లు రాబట్టడం లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా బదులిచ్చింది అలయా. -
వేడుకలా షబానా 50 ఏళ్ల సినీ ప్రయాణం
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఫ్ఫ్) ఓ వేడుకను నిర్వహించనుంది. -
ముందుగానే ‘టర్బో’ రాక
వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?