vijay devarakonda: సీమ కథతో తొలిసారి

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌తో ఓ సినిమా చేయనున్నారు.

Updated : 01 May 2024 09:48 IST

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌తో ఓ సినిమా చేయనున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి రానున్న రెండో చిత్రమిది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇది రాయలసీమ నేపథ్యంగా సాగే పీరియాడిక్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్‌ తొలిసారి సీమ యాసలో సంభాషణలు పలకనున్నట్లు తెలిసింది. ఈ నెల 9న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని