Turbo: ముందుగానే ‘టర్బో’ రాక

వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్‌ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్‌ తెరకెక్కిస్తున్న మాస్‌ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్‌ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Updated : 01 May 2024 09:51 IST

వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్‌ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్‌ తెరకెక్కిస్తున్న మాస్‌ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్‌ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజా ఈ చిత్రం నెల రోజుల ముందుగానే మే 23న అభిమానుల ముందుకు రానున్నట్లు వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ని పంచుకుంది. ‘టర్బో మోడ్‌ యాక్టివేటెడ్‌’ అనే వ్యాఖ్యతో ఉన్న పోస్టర్‌ ఆసక్తిగా ఉంది. ‘అనుకున్న దానికంటే ముందుగానే చిత్రం రానుంది. మునుపెన్నడూ లేని విధంగా థ్రిల్‌ని పంచేందుకు సిద్ధంగా ఉందీ సినిమా’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది.


దమ్ము చూపడానికొస్తున్న అజయ్‌ దేవగణ్‌

సీనియర్‌ నాయకనాయికలు అజయ్‌ దేవగణ్‌, టబు జంటగా నటిస్తున్న చిత్రం ‘ఔరోం మే కహా ధమ్‌ థా?’. జిమ్మీ షేర్‌గిల్‌, సయీ మంజ్రేకర్‌, శంతను మహేశ్వరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నీరజ్‌ పాండే దర్శకుడు. ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రీకరణ పూర్తి చేసుకొని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమాని జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రవర్గాలు ప్రకటించాయి. శీతల్‌ భాటియా, నరేంద్ర హీరావత్‌, కుమార్‌ మంగత్‌ పాఠక్‌ నిర్మించారు.


‘తిండిబోతు దెయ్యం’ వినోదం

రసింహ బోదాసు హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తిండిబోతు దెయ్యం’. శిరీష బోదాసు నిర్మిస్తున్నారు. మోనిక సమత్తార్‌, తన్నీరు వాసవి కథానాయికలు. ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రేలంగి నరసింహారావు క్లాప్‌ కొట్టగా.. శిరీష కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు నరసింహ బోదాసు మాట్లాడుతూ.. ‘‘వినోదం నిండిన హారర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. కథ చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మోనిక, వాసవి, అశోక్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ సాయి తదితరులు పాల్గొన్నారు.


‘బ్రహ్మచారి’ నవ్వులు

ల్లేశం, స్వప్న, సిరి, రోషిని రజాక్‌ ప్రధాన పాత్రల్లో నర్సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మచారి’. రాంభూపాల్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఈనెల 10న రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ యాసలో సాగే మంచి వినోదాత్మక చిత్రమిది. మేమెంతో ఇష్టపడి, కష్టపడి చేశాం. అందరూ ఆదరించి.. విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడు చాలా సహజంగా అనిపించింది. ఊర్లో రచ్చబండ దగ్గర మాట్లాడుకునేలా ఉంది. అందుకే దీన్ని నిర్మించాలని అనుకున్నా. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత రాంభూపాల్‌ రెడ్డి. కార్యక్రమంలో చంద్ర మహేశ్‌, వీర్‌ శంకర్‌, ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని