Turbo: ముందుగానే ‘టర్బో’ రాక
వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజా ఈ చిత్రం నెల రోజుల ముందుగానే మే 23న అభిమానుల ముందుకు రానున్నట్లు వెల్లడిస్తూ కొత్త పోస్టర్ని పంచుకుంది. ‘టర్బో మోడ్ యాక్టివేటెడ్’ అనే వ్యాఖ్యతో ఉన్న పోస్టర్ ఆసక్తిగా ఉంది. ‘అనుకున్న దానికంటే ముందుగానే చిత్రం రానుంది. మునుపెన్నడూ లేని విధంగా థ్రిల్ని పంచేందుకు సిద్ధంగా ఉందీ సినిమా’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది.
దమ్ము చూపడానికొస్తున్న అజయ్ దేవగణ్
సీనియర్ నాయకనాయికలు అజయ్ దేవగణ్, టబు జంటగా నటిస్తున్న చిత్రం ‘ఔరోం మే కహా ధమ్ థా?’. జిమ్మీ షేర్గిల్, సయీ మంజ్రేకర్, శంతను మహేశ్వరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నీరజ్ పాండే దర్శకుడు. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రీకరణ పూర్తి చేసుకొని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమాని జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రవర్గాలు ప్రకటించాయి. శీతల్ భాటియా, నరేంద్ర హీరావత్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించారు.
‘తిండిబోతు దెయ్యం’ వినోదం
నరసింహ బోదాసు హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తిండిబోతు దెయ్యం’. శిరీష బోదాసు నిర్మిస్తున్నారు. మోనిక సమత్తార్, తన్నీరు వాసవి కథానాయికలు. ఈ సినిమా మంగళవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రేలంగి నరసింహారావు క్లాప్ కొట్టగా.. శిరీష కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు నరసింహ బోదాసు మాట్లాడుతూ.. ‘‘వినోదం నిండిన హారర్ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. కథ చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మోనిక, వాసవి, అశోక్ గౌడ్, శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.
‘బ్రహ్మచారి’ నవ్వులు
మల్లేశం, స్వప్న, సిరి, రోషిని రజాక్ ప్రధాన పాత్రల్లో నర్సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మచారి’. రాంభూపాల్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఈనెల 10న రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ యాసలో సాగే మంచి వినోదాత్మక చిత్రమిది. మేమెంతో ఇష్టపడి, కష్టపడి చేశాం. అందరూ ఆదరించి.. విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడు చాలా సహజంగా అనిపించింది. ఊర్లో రచ్చబండ దగ్గర మాట్లాడుకునేలా ఉంది. అందుకే దీన్ని నిర్మించాలని అనుకున్నా. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత రాంభూపాల్ రెడ్డి. కార్యక్రమంలో చంద్ర మహేశ్, వీర్ శంకర్, ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
తన కుమారుడి తెరంగేట్రంపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. -
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
నటి హేమ సోషల్ మీడియాలో కొత్త వీడియో షేర్ చేశారు. -
బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నా సినిమాల్లో చేసిన నటీనటులు ఆ విషయంలో బాధపడతారు: సంజయ్ లీలా భన్సాలీ
ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసమే తాను సినిమాలు తెరకెక్కిస్తానని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అన్నారు. -
కమెడియన్లను తక్కువ అంచనా వేయకండి: శివ కార్తికేయన్
సూరి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గరుడన్’. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్కు శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి తదితరులు హాజరయ్యారు. -
అతడి ప్రవర్తనకు భయపడ్డా: కాజల్ అగర్వాల్
తన కెరీర్లో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పారు కాజల్ అగర్వాల్. ఏమైందంటే? -
కేన్స్లో ‘కన్నప్ప’ టీజర్.. రెస్పాన్స్పై విష్ణు పోస్ట్..
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దానికి మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు. -
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
విశాల్ ‘రత్నం’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘హరోం హర’ వాయిదా.. బాధగా ఉందంటూ సుధీర్ బాబు పోస్ట్
సుధీర్ హీరోగా తెరకెక్కిన ‘హరోం హర’ (Harom Hara) వాయిదా పడింది. -
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ గురించి ఆనంద్ దేవరకొండ స్పందించారు. -
ఆగస్టు నుంచి ఆరంభం
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
నేనేంటో నిరూపించుకోవడమే ముఖ్యం
‘‘కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాన’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కియారా అడ్వాణీ. తనదైన నటనతో మెప్పించే ఈ భామ.. ఇటీవలే కేన్స్ చిత్రోత్సవాల్లో మెరిసి సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. -
సంగీత పరిణామం... మనోహర ప్రయాణం
సంగీత సరిగమల సంద్రంలో.. పదాలే పడవలుగా ప్రయాణం చేస్తూ.. గొప్ప సంగీతకారులుగా ఎదుగుతారు కొందరు. అలా ఎదిగిన వారిలో ఏఆర్. రెహమాన్ ఒకరు. -
ఈసారీ వర్షం పడింది.. విజయమే
‘గం.. గం.. గణేశా’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్ శెట్టి తెరకెక్కించారు. -
దీపావళికి కంగువా..?
మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ తెరకెక్కిస్తున్నారు. -
వివాదంలో పాయల్ రాజ్పూత్
నటి పాయల్ రాజ్పూత్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో ప్రణదీప్ ఠాకూర్ దర్శక నిర్మాణంలో ‘రక్షణ’ (5వైస్) అనే చిత్రంలో నటించింది. -
పాత్ర కోసం నిజమైన బంగారం
భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ మిరాయ్
మంచు మనోజ్ వెండితెరపై కనిపించి 8ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడాయన ‘మిరాయ్’తో తిరిగి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
నటి పాయల్ రాజ్పుత్ సోషల్మీడియా వేదికగా పెట్టిన పోస్టు సరైన నిర్ణయం కాదని నిర్మాతల మండలి పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు