National Cinema Day: మల్టీప్లెక్స్లో రూ. 99కే సినిమా టికెట్.. ఆఫర్ ఆ ఒక్క రోజే!
‘నేషనల్ సినిమా డే’ పురస్కరించుకుని మల్టీప్లెక్స్ల్లో సినిమా టికెట్ ధరలు రూ.99కే అందుబాటులో ఉండనున్నాయి. ఏ రోజంటే?
ఇంటర్నెట్ డెస్క్: మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎం.ఎ.ఐ) (Multiplex Association of India) సినీ అభిమానులకు శుభవార్త చెప్పింది. పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలిస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, మూవీ టైమ్, వేవ్, ఎమ్2కే, డిలైట్ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 13ను ‘నేషనల్ సినిమా డే’ (National Cinema Day)గా పేర్కొంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఒక్క రోజే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఆయా థియేటర్లలో నేరుగా టికెట్ తీసుకుంటేనే రూ.99కి లభించనుంది. ఆన్లైన్ ద్వారా బుక్ చేయాల్సివస్తే టికెట్ ధరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. రిక్లెయినర్స్, ప్రీమియం ఫార్మాట్స్కు ఈ ఆఫర్ వర్తించదు.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్సిరీస్లివే!
ఎగ్జిబిటర్లకు దిశానిర్దేశం చేసే ఎం.ఎ.ఐ.. గతేడాది సెప్టెంబరు 23న నేషనల్ సినిమా డే సెలబ్రేషన్స్ చేసింది. ఆ ఒక్క రోజే 6.5 మిలియన్స్కుపైగా ఆడియన్స్ మల్టీప్లెక్స్ల్లో సినిమాలు చూశారు. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో ప్రేక్షకులకు మరోసారి ఆఫర్ ఇచ్చింది. కొవిడ్ రెండు వేవ్ల తర్వాత భారత్లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో సెప్టెంబరు 16ను సినిమా డేగా ప్రకటించి అనివార్యకారణాలతో సెప్టెంబరు 23కి వాయిదా వేశారు. ఇప్పుడు అక్టోబరు 13ని ఎంపిక చేశారు. ప్రస్తుతం విడుదలైన, త్వరలో విడుదలకానున్న చిత్ర బృందాలకు ఇది కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ ‘స్కంద’ (Skanda), రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2), వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War) తదితర చిత్రాలు సెప్టెంబరు 28న, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ (Peda Kapu-1), కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) అక్టోబరు 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. షారుక్ ఖాన్ ‘జవాన్’ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి