Prabhas: ప్రభాస్ దృష్టంతా ఇప్పుడు ఆ సినిమాపైనే.. మారుతీ మూవీ మరింత ఆలస్యం?
వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్(Prabhas).
హైదరాబాద్: వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్(Prabhas). ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’(Project K)లో నటిస్తున్నారు. దీపిక పదుకొణె కథానాయిక. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వ్యయంతో వైజయంతీ మూవీస్ దీన్ని తెరకెక్కిస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ దృష్టి అంతా ‘ప్రాజెక్ట్-కె’పైనే పెట్టినట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకూ ఈ సినిమా షూటింగ్లోనే పాల్గొననున్న ప్రభాస్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ‘సలార్’ సెట్లో అడుగు పెడతారు. వీలైనంత త్వరగా ‘సలార్’(Salaar) పూర్తి చేసి, మళ్లీ ‘ప్రాజెక్ట్ కె’చిత్రీకరణలో పాల్గొనాలని భావిస్తున్నారట. సెట్స్, ఇతర సాంకేతిక కారణాలతో ఆలస్యమైతే తప్ప ‘ప్రాజెక్ట్ కె’కే ఎక్కువ డేట్స్ ఇవ్వాలని ప్రభాస్ అనుకుంటున్నారట. దీంతో మారుతీ దర్శకత్వంలో చేసే సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. వరుసగా పెద్ద సినిమాలను చేస్తున్న ప్రభాస్, మారుతీ చెప్పిన కథకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారు. కానీ, ‘ప్రాజెక్ట్-కె’కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రభాస్ దీనిపై దృష్టి పెట్టారని టాక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!