‘కేజీఎఫ్ 2’లో ప్రకాశ్ రాజ్ పాత్ర అదేనా?
దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే....
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్: చాప్టర్2’ను తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తాజాగా షూటింగ్లకు అనుమతులు రావడంతో బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్లో ‘కేజీఎఫ్: చాప్టర్2’ చిత్రీకరణను ప్రారంభించారు. ‘కేజీఎఫ్-2’లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ రోజు షూటింగ్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోను బట్టి ప్రకాశ్ రాజ్ పాత్రపై ఓ స్పష్టత వచ్చినట్లయింది.
తొలి ‘కేజీఎఫ్’లో సీనియర్ జర్నలిస్టు ఆనంద్ వాసిరాజు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ ప్రాంతంలో ఏం జరిగిందో వివరిస్తుండగా.. సినిమా కథ ముందుకు సాగుతుంటుంది. సీనియర్ నటుడు అనంత్ నాగ్ పోషించిన ఆ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అనుకోని కారణాల వల్ల ఆయన ‘కేజీఎఫ్ 2’ నుంచి తప్పుకొన్నారు. మరి ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో అంటూ వస్తున్న ప్రశ్నలకు తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫొటో సమాధానమిచ్చింది. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన మరో ఫొటోలో అయితే ఇంటర్వ్యూ సెటప్ అంతా కనిపిస్తోంది. ఒకవేళ ప్రకాశ్ ఆ పాత్రలో కనిపిస్తే... పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి, ఆ పాత్రకు మరింత బలం చేకూరనుంది.
ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్దత్ ఈ సినిమాలో కీలకమైన ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఆ పాత్రకు సంబంధించిన లుక్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రధానిగా రవీనా టాండన్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.