Priyanka Chopra: నటీనటులపై ప్రియాంక చోప్రా వైరల్ కామెంట్స్
దక్షిణాది చిత్రంతో కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి ప్రస్తుతం హాలీవుడ్లోనూ సత్తా చాటుతున్నారు నటి ప్రియాంక చోప్రా. తాజాగా ఈ భామ నటీనటుల కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముంబయి: సుమారు మూడేళ్ల తర్వాత భారత్కు వచ్చి వెళ్లారు నటి ప్రియాంక చోప్రా. నటిగానే కాకుండా బిజినెస్ లేడీగానూ రాణిస్తోన్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటీనటుల కెరీర్ గురించి వైరల్ కామెంట్స్ చేశారు. ‘‘ఉత్తమ నటిగా ఎలా ఎదగాలో బాలీవుడ్లోని ప్రముఖ దర్శకులతో పనిచేసినప్పుడు నేర్చుకున్నా. నటీనటుల కెరీర్ గురించి నాకు ఎప్పుడూ ఒకటే అనిపిస్తుంటుంది. స్వతహాగా ఏం చేయకపోయినప్పటికీ వాళ్లకే సినీ ప్రేక్షకులు ఎక్కువగా క్రెడిట్ ఇస్తుంటారు. ఎందుకంటే.. ఎవరో రచయిత రాసిన మాటలను స్క్రీన్పై మేము చెబుతాం. ఎవరో డ్యాన్స్ కంపోజ్ చేస్తే కాలు కదుపుతాం. గాయనీ గాయకులు పాడిన పాటలకు మేము కేవలం లిప్సింక్ ఇస్తాం. కాబట్టి, స్వతహాగా ఒక నటిగా నేను ఏం చేస్తున్నా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.